NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ట్రావెల్: ఆనాటి రాచరికానికి గుర్తుగా నిలిచిన కోల్ కతా లోని రాజభవనాలు
    తదుపరి వార్తా కథనం
    ట్రావెల్: ఆనాటి రాచరికానికి గుర్తుగా నిలిచిన కోల్ కతా లోని రాజభవనాలు
    కోల్ కతా లోని ప్రసిద్ధ రాజభవనాలు

    ట్రావెల్: ఆనాటి రాచరికానికి గుర్తుగా నిలిచిన కోల్ కతా లోని రాజభవనాలు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jan 30, 2023
    03:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    స్వాతంత్య్రానికి ముందు బ్రిటీషర్ల పాలనలో ఉన్న ఇండియాలో అనేక రాజభవనాలు నిర్మింపబడ్డాయి. ఆనాటి రాచరికానికి గుర్తుగా ఆ రాజభవనాలు ఇప్పటికీ ఇంకా మిగిలే ఉన్నాయి.

    మీకు పర్యాటకం ఇష్టమైతే కోల్ కతా లోని ఈ రాజభవనాలను సందర్శించండి. అబ్బుర పరిచే సౌందర్యంతో పాటు ఆసక్తిగొలిపే చరిత్ర మీకు తెలుస్తుంది.

    శోభా బజార్ రాజభవనం: సుతానుతి అనే గ్రామాన్ని పాలించే మహారాజ నవక్రిష్ణ దేవ్ నిర్మించిన ఈ రాజభవనం, ఉత్తర కోల్ కతాలో ఉంది. చుట్టూ పచ్చదనంతో చూడడానికి మనోహరంగా ఉంటుంది.

    ఈ రాజభవనంలోని ఇటాలియన్ ఇంటీరియర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ రాజభవనంలో ప్రతీ ఏడాది దుర్గాపూజ నిర్వహిస్తారు. 1757లో మొట్టమొదటి సారి దుర్గాపూజ ఇక్కడే నిర్వహించారని చెప్పుకుంటారు.

    ట్రావెల్

    కోల్ కతా లోని మరికొన్ని రాజభవనాలు

    జోర్సాంకో తకుర్బరి: నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్ర నాథ్ ఠాగూర్ నివాసంగా ఉన్న ఈ భవనం, కోల్ కతాలో రబీంద్ర సరనిలో ఉంది. బ్రిటీష్ కాలంలో ఈ భవనంలో పార్టీలు, నృత్య ప్రదర్శనలు జరిగేవి.

    బసుబతి: కోల్ కతాలో బాగా బజార్ ప్రాంతంలో ఉన్న ఈ రాజభవనాన్ని పశుపతి బసు, నందలాల్ జమీందార్లు నిర్మించారు. ఈ భవనాన్ని 13వ శతాబ్దానికి చెందిన హోయసాలుల కళాకారుల నైపుణ్య స్ఫూర్తితో నిర్మించారు.

    బావలి రాజభవనం: కోల్ కతా లోని నోడాకలి ప్రాంతంలో 250సంవత్సరాల క్రితం నిర్మించిన భవనం ఇది. బెంగాల్ కి చెందిన మోండల్ కుటుంబానికి చెందింది ఈ భవనం. స్వాతంత్ర్యం తర్వాత ఈ భవనానిని ఎన్నో మార్పులు చేసి అందమైన రిసార్ట్ గా తీర్చిదిద్దారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Kuldeep Yadav: డీఆర్ఎస్ నిర్ణయంపై కుల్దీప్ ఫైర్‌.. అంపైర్‌తో మాటల యుద్ధం! కుల్దీప్ యాదవ్
    Nadikudi- Srikalahasthi: నెరవేరనున్న ప్రకాశం జిల్లా ప్రజల కోరిక.. నడికుడి - శ్రీకాళహస్తి మధ్య రైల్వే లైన్  రైల్వే స్టేషన్
    IPL 2025: ఒక్క ప్లేఆఫ్స్ స్థానం కోసం ముంబై, ఢిల్లీ, లక్నో మధ్య హోరాహోరీ! ఐపీఎల్
    Viral Video: భారీ వర్షాన్ని లెక్కచేయక పంటను కాపాడుకునేందుకు రైతు ప్రయత్నం.. స్పందించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025