LOADING...
IRCTC Tour: ఐఆర్‌సీటీసీ కేరళ మాన్‌సూన్ మ్యాజిక్ టూర్.. హౌస్‌బోట్ ప్రయాణంతో 7 రోజుల అద్భుత విహారం
హౌస్‌బోట్ ప్రయాణంతో 7 రోజుల అద్భుత విహారం

IRCTC Tour: ఐఆర్‌సీటీసీ కేరళ మాన్‌సూన్ మ్యాజిక్ టూర్.. హౌస్‌బోట్ ప్రయాణంతో 7 రోజుల అద్భుత విహారం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2026
10:56 am

ఈ వార్తాకథనం ఏంటి

వర్షాకాలంలో కేరళ అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. 'కేరళం మాన్‌సూన్ మ్యాజిక్' పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ 6 రాత్రులు, 7 రోజుల పర్యటనలో కొచ్చి, మున్నార్, కుమరకోమ్, త్రివేండ్రంతో పాటు కేరళలోని పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తోంది. ముఖ్యంగా సంప్రదాయ హౌస్‌బోట్‌లో బస, క్రూయిజ్ ప్రయాణం ఈ ప్యాకేజీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆగస్టు 3న ప్రారంభమయ్యే ఈ టూర్‌లో ప్రయాణికులు విమానంలో హైదరాబాద్ నుంచి కొచ్చి చేరుకుంటారు. తొలి రోజు హోటల్‌లో చెక్‌ఇన్ అనంతరం ప్రసిద్ధ డచ్ ప్యాలెస్, మెరైన్ డ్రైవ్‌ను సందర్శించి కొచ్చిలోనే బస చేస్తారు.

వివరాలు 

మొదటి రోజు

హైదరాబాద్ నుంచి విమానంలో కొచ్చి చేరుకుని హోటల్‌లో బస ఏర్పాటు చేస్తారు. భోజనం అనంతరం డచ్ ప్యాలెస్, మెరైన్ డ్రైవ్ సందర్శన ఉంటుంది. రాత్రికి కొచ్చిలోనే బస. రెండో రోజు ఉదయం అల్పాహారం తర్వాత సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతిరపల్లి జలపాతాన్ని సందర్శిస్తారు. బాహుబలి సినిమాతో మరింత ప్రాచుర్యం పొందిన ఈ జలపాతం వర్షాకాలంలో కనువిందు చేస్తుంది. అనంతరం గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకుని తిరిగి కొచ్చికి చేరుకుంటారు. మూడో రోజు కొచ్చి నుంచి బయలుదేరి సుమారు 130 కిలోమీటర్ల దూరంలోని మున్నార్‌కు ప్రయాణం ఉంటుంది. హోటల్‌లో చెక్‌ఇన్ చేసిన తర్వాత మెట్టుపెట్టి డ్యామ్, ఎకో పాయింట్ వంటి ప్రముఖ ప్రదేశాలను సందర్శిస్తారు. రాత్రికి మున్నార్‌లో బస ఉంటుంది.

వివరాలు 

నాలుగో రోజు

రోజంతా మున్నార్‌లోని ప్రకృతి అందాలను ఆస్వాదించేలా టూర్ ఉంటుంది. విస్తారమైన తేయాకు తోటలు, పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ ఆహ్లాదకరమైన సమయాన్ని గడపవచ్చు. రాత్రికి మున్నార్‌లోనే బస. ఐదో రోజు ఉదయం మున్నార్ నుంచి బయలుదేరి దాదాపు 160 కిలోమీటర్ల దూరంలోని కుమరకోమ్ చేరుకుంటారు. అక్కడ సంప్రదాయ హౌస్‌బోట్‌లో చెక్‌ఇన్ చేసి క్రూయిజ్ ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. హౌస్‌బోట్‌లోనే మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఏర్పాటు చేస్తారు. రాత్రికి హౌస్‌బోట్‌లోనే బస ఉంటుంది.

Advertisement

వివరాలు 

ఆరో రోజు

కుమరకోమ్ నుంచి బయలుదేరి సుమారు 170 కిలోమీటర్ల దూరంలోని త్రివేండ్రం చేరుకుంటారు. మార్గమధ్యంలో సముద్ర తీరాన వెలసిన ప్రసిద్ధ ఆళిమల శివాలయాన్ని సందర్శిస్తారు. అనంతరం త్రివేండ్రంలో బస ఏర్పాటు చేస్తారు. ఏడో రోజు ఉదయం శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం నేపియర్ మ్యూజియంను సందర్శించి మధ్యాహ్నానికి త్రివేండ్రం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరి సాయంత్రానికి చేరుకోవడంతో ఈ టూర్ ముగుస్తుంది. ప్యాకేజీ ధరలు ఐఆర్‌సీటీసీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ట్రిపుల్ ఆక్యుపెన్సీ : రూ.41,000 డబుల్ ఆక్యుపెన్సీ : రూ.44,000 సింగిల్ ఆక్యుపెన్సీ : రూ.60,700 5-11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో : రూ.34,600 5-11 ఏళ్ల పిల్లలకు బెడ్ లేకుండా : రూ.30,600

Advertisement

వివరాలు 

బుకింగ్ వివరాలు

ఈ ప్రత్యేక కేరళ మాన్‌సూన్ మ్యాజిక్ టూర్‌కు సంబంధించిన బుకింగ్‌లు, ఇతర వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా ఐఆర్‌సీటీసీ ప్రతినిధులను సంప్రదించవచ్చు. వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని స్థానిక అధికారుల సూచనలను పాటించాలని సూచించింది.

Advertisement