NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Education News: పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి లోనవ్వకుండా ఉండాలంటే.. ఇలా చెయ్యండి..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Education News: పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి లోనవ్వకుండా ఉండాలంటే.. ఇలా చెయ్యండి..
    పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి లోనవ్వకుండా ఉండాలంటే.. ఇలా చెయ్యండి..

    Education News: పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి లోనవ్వకుండా ఉండాలంటే.. ఇలా చెయ్యండి..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 10, 2025
    10:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పరీక్షలు సమీపిస్తున్నాయి అనగానే సహజంగానే ఈ సమయంలో విద్యార్థులు ఒత్తిడిని ఎదుర్కొంటారు.

    సమయం తక్కువగా ఉన్నప్పుడు ఒత్తిడి మరింత పెరుగుతుంది. కొంతమంది విద్యార్థులు చివరి క్షణాల్లో మాత్రమే చదవడం ప్రారంభిస్తారు.

    ఆలస్యం చేయడం, చదువును వాయిదా వేయడం వల్ల ఒత్తిడి అధికమవుతుంది, ఫలితంగా మెరుగైన గ్రేడ్‌లు పొందలేకపోతారు.

    అయితే, పరీక్షలకు ముందు ఒత్తిడిని తగ్గించుకోవడానికి, సమర్థవంతంగా చదవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి.

    ఉత్తమ ఫలితాలను సాధించేందుకు అధ్యయన ప్రణాళికను ఎలా రూపొందించుకోవాలో చూద్దాం.

    వివరాలు 

    చదువులో సమయ నియంత్రణ 

    30 నిమిషాల పద్ధతి: కొంతమంది పరీక్షలు దగ్గరపడినప్పుడు విపరీతంగా చదువుతారు. ఇది ప్రయోజనకరం కాకపోవచ్చు. మూడ్ ఫ్రెష్‌గా ఉండేందుకు చదువును చిన్న భాగాలుగా విభజించుకోవాలి. ఉదాహరణకు, ఒక రోజు ముందు గంటల కొద్దీ చదవడం కన్నా, ఒక వారం పాటు రోజుకు 30 నిమిషాలు చదవడం ఉత్తమం.

    పనులకు షెడ్యూల్: సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి. ప్రతి సబ్జెక్టుకు సమానమైన ప్రాధాన్యత ఇవ్వాలి. వాయిదా వేయకుండా, నిర్ణయించుకున్న లక్ష్యాలను పాటించాలి.

    వివరాలు 

    మేధస్సును మెరుగుపరిచే వ్యూహాలు 

    ఫ్లాష్ కార్డులు: విషయాలను సులభంగా గుర్తుంచుకోవడానికి ఫ్లాష్ కార్డులను ఉపయోగించండి. ఉదాహరణకు, మానవ శరీర అవయవాల పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే, అవి ఎక్కడ ఉన్నాయో ఫ్లాష్ కార్డుల ద్వారా క్రమబద్ధంగా నేర్చుకోండి.

    ప్రయోజనకరమైన నోట్స్: తరగతి గదిలో ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకోవడం అవసరం. ఇది పుస్తకంలోని ప్రతీ పేజీ చదవకుండానే ముఖ్యాంశాలను తెలుసుకునేలా చేస్తుంది.

    సమర్థవంతమైన పద్ధతులు సరైన అధ్యయన విధానం: ఎవరికైనా అనువైన విధానం వేర్వేరు కావచ్చు. చదువుతున్నప్పుడు ముఖ్యమైన అంశాలను హైలైట్ చేసుకోవాలి. గణితంలో సూత్రాలు, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఫార్ములాలు లాజిక్‌తో గుర్తుపెట్టుకోవాలి.

    వివరాలు 

    కీలకమైన సబ్జెక్టులకు ప్రాధాన్యత 

    విరామాలు తీసుకోవడం: నిరంతరంగా గంటల తరబడి చదవడం మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. ప్రతి గంటకు కొద్ది సమయం విరామం తీసుకుంటే మరింత ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షల ముందు రెండు రోజుల పాటు అతిగా చదవకుండా, ముఖ్యమైన అంశాలను మాత్రమే రివైజ్ చేయాలి.

    అవసరమైన విషయాలపై దృష్టి: ముఖ్యమైన సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించాలి. కష్టతరమైన అంశాలకు ఎక్కువ సమయం, తేలికైనవాటికి తక్కువ సమయం కేటాయించాలి.

    ఏవైనా సందేహాలు ఉంటే ముందుగానే క్లియర్ చేసుకోవాలి. ఈ వ్యూహాలను పాటిస్తే, పరీక్షల్లో ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు, ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతారు!

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పరీక్షలు

    తాజా

    IMF: యుద్దం వేళ.. పాకిస్తాన్ కు IMF 1 బిలియన్ డాలర్ల రుణం మంజూరు..  పాకిస్థాన్
    Pak drone attacks: 20 నగరాలు లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్ దాడులు.. సమర్థవంతంగా అడ్డుకున్న భారత సైన్యం.. ఆపరేషన్‌ సిందూర్‌
    Donald Trump: భారత్‌పై పాక్ డ్రోన్ల దాడి.. స్పందించిన డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్
    Pak Drone Attack: ఓ ఇంటిపై కూలిన పాక్ డ్రోన్.. ముగ్గరికి తీవ్ర గాయాలు  భారతదేశం

    పరీక్షలు

    15 నిమిషాల ముందే గేట్ క్లోజ్.. గ్రూప్1 అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ కీలక సూచనలు తెలంగాణ
    TREIRB: రేపటి నుంచి గురుకుల ఉద్యోగ నియామక పరీక్షలు; బూట్లతో వస్తే నో ఎంట్రీ తెలంగాణ
    తెలంగాణ: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు టీఎస్పీఎస్సీ
    NEET Syllabus 2024 : నీట్ నూతన సిలబస్‌ను రిలీజ్ చేసిన ఎన్‌ఎంసీ ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025