Maha Shivratri 2026: శివభక్తులారా జాగ్రత్త.. ఉపవాసం ముగించేందుకు సరైన సమయాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాల్లో మహా శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు అభిషేకప్రియుడైన శివుడికి పాలు, జలంతో అభిషేకాలు చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 'ఓం నమః శివాయ' నామస్మరణతో శివాలయాలు మార్మోగుతున్నాయి. ఈ పవిత్ర దినాన భక్తులు ఉపవాసం పాటించి, శివాలయాలను దర్శించి, రాత్రంతా జాగరణ చేస్తూ పరమేశ్వరుడిని స్తుతిస్తారు. నిజమైన భక్తితో ఉపవాసం ఉండి శివారాధన చేస్తే కోరికలన్నీ నెరవేరుతాయని విశ్వాసం. మరుసటి రోజు శుభ ముహూర్తంలో ఉపవాస విరమణ చేయడం అత్యంత ముఖ్యమని భావిస్తారు. సరైన ఆచార విధానాలతో ఉపవాసాన్ని ముగించడం శాస్త్రోక్తంగా ఉండాలని పెద్దలు చెబుతారు.
Details
ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి?
ఫిబ్రవరి 15న మహాశివరాత్రి ఉపవాసం పాటిస్తున్నారు. 2026 ఫిబ్రవరి 16న ఉపవాస విరమణ చేయాలి. శుభ సమయాన్ని పాటించడం అత్యంత ప్రాధాన్యమైనది. మొదటి శుభ సమయం: ఫిబ్రవరి 16 ఉదయం 7:00 నుండి 8:33 వరకు. రాహుకాలం ఉదయం 8:33 నుండి 9:58 వరకు ఉంటుంది. ఈ సమయంలో ఉపవాసాన్ని విరమించకూడదు. అమృత కాలం: ఉదయం 9:58 నుండి 11:38 వరకు. ఉపవాస విరమణకు ఇది అత్యంత శుభప్రదమైన సమయంగా పరిగణిస్తారు. అభిజిత్ ముహూర్తం: మధ్యాహ్నం 12:30 నుండి 1:16 వరకు. ఈ సమయంలో కూడా ఉపవాసాన్ని ముగించవచ్చు.
Details
విజయ్ ముహూర్తం
మధ్యాహ్నం 3:48 నుండి 3:34 వరకు (సమయాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు; కాబట్టి స్థానిక పంచాంగాన్ని సంప్రదించడం మంచిది). ఈ సమయాన్ని కూడా శుభప్రదంగా భావిస్తారు. ఎల్లప్పుడూ రాహుకాలం వంటి అశుభ సమయాలను నివారించి శుభ ముహూర్తంలోనే ఉపవాసాన్ని ముగించాలి. ఏవైనా సందేహాలుంటే స్థానిక పంచాంగం లేదా పండితుడిని సంప్రదించడం ఉత్తమం.
Details
ఉపవాసం ఎలా ముగించాలి?
ఫిబ్రవరి 16 ఉదయం నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజా స్థలాన్ని శుభ్రపరిచి ధూపం, దీపాలు వెలిగించి శివారాధన చేయాలి. బిల్వపత్రాలు, పాలు, పెరుగు, నెయ్యి సమర్పించి శివలింగంపై నీరు, పాలతో అభిషేకం చేయాలి. శివ మంత్రాలు జపించి, శివ చాలీసాను పఠించడం శ్రేయస్కరం. శివుడికి అరటిపండ్లు, ఆపిల్, రేగు పండ్లు వంటి ఫలాలను నైవేద్యంగా సమర్పించవచ్చు. పూజ ముగింపులో హారతి ఇచ్చి ఆశీర్వాదం పొందాలి. అనంతరం శుభ సమయాన సాత్విక, తేలికపాటి ఆహారంతో ఉపవాసాన్ని విరమించాలి.