NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Bharat Ratna : అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకి 70 ఏళ్లు.. ప్రారంభించింది ఎవరో తెలుసా
    తదుపరి వార్తా కథనం
    Bharat Ratna : అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకి 70 ఏళ్లు.. ప్రారంభించింది ఎవరో తెలుసా
    ప్రారంభించింది ఎవరో తెలుసా

    Bharat Ratna : అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకి 70 ఏళ్లు.. ప్రారంభించింది ఎవరో తెలుసా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jan 02, 2024
    11:16 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో ఏదైనా ఒక రంగంలో విశేషంగా కృషి చేసిన పౌరులకు భారత ప్రభుత్వం భారతరత్నను ప్రదానం చేస్తుంది.

    ఈ మేరకు అత్యున్నత స్థాయి పౌర పురస్కారాన్ని 1954 జనవరి 2న భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు.

    ఈ 7దశాబ్దాల కాలంలో ఎందరో మేధావులు, రచయితలు, సామాజిక ఉద్యమకారులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, కళాకారులు, రచయితలు, రాజకీయ నాయకులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

    కుల, మత, వర్గ, వర్ణ, విద్య తదితర రంగాల్లో విశేషంగా సేవలు అందించిన వారికి ఈ పురస్కారాన్ని అందిస్తారు.

    ఇదే సమయంలో పద్మ అవార్డులకు కాస్త భిన్నంగా భారతరత్న పురస్కారానికి ఎంపిక జరుగుతుంది. భారతరత్న పురస్కారానికి అర్హులైన వక్తులను ప్రధానమంత్రే నేరుగా రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు.

    details

    భారతరత్నకు 7వ స్థాయి గౌరవం 

    ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి మాత్రమే దీన్ని అందిస్తారు.భారతరత్న పౌరులకు 7వస్థాయి గౌరవం లభిస్తుంది.

    తొలి 6 స్థానాల ప్రోటోకాల్ వీరివే...

    రాష్ట్రపతి,ఉపరాష్ట్రపతి,ప్రధాన మంత్రి,గవర్నర్, మాజీ రాష్ట్రపతులు,ఉపప్రధాని,భారత ప్రధాన న్యాయమూర్తి

    ఈ క్రమంలోనే పురస్కార గ్రహీతలకు సర్టిఫికెట్,రావి ఆకులను పోలిన పతకాన్ని రాష్ట్రపతి అందజేస్తారు.

    ప్లాటినంతో చెక్కిన సూర్యుడి ముద్ర ఒకవైపు, కింద హిందీలో భారతరత్న అని కనిపిస్తుంది. పతకం అంచుల్లోనూ ప్లాటినం లైనింగ్'తో తీర్చుదిద్ది ఉంటుంది. రెండో వైపు అశోక స్తంభం ముద్ర ఉంటుంది.

    దాని కింద దేవనాగరి లిపిలో 'సత్యమేవ జయతే' అని కనిపిస్తుంటుంది. వీరికి రైల్వేలో ఉచిత ప్రయాణం, జాతీయ, రాష్ట్రంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం, ప్రోటోకాల్‌ మర్యాద ఉంటాయి.

    Details

    చివరిసారిగా 2019లో అవార్డు ప్రదానం

    అయితే, పేరుకు ముందు 'భారతరత్న' అని బహిరంగంగా రాసుకుని, ప్రదర్శించకూడదు. తమ లెటర్‌హెడ్, విజిటింగ్ కార్డుల్లో ఈ అవార్డు అందుకున్నట్లు రాసుకోవచ్చు. ఇప్పటివరకు 48 మందికి ఈ అవార్డును ప్రదానం చేశారు.

    విదేశీయులైన సరిహద్దు గాంధీగా పేరు పొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, నెల్సన్ మండేలా భారతరత్న అందుకున్నారు.

    మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా ప్రభుత్వం ఈ పురస్కారాన్ని నిలిపివేసింది. 2013లో తొలిసారి క్రీడాకారులకు దీన్ని ఇవ్వాలని నిర్ణయించారు. 2014లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేశారు.

    ఇప్పటివరకు 48 మందికి ఈ అవార్డును అందించారు. చివరిసారిగా 2019లో అవార్డును ప్రదానం చేశారు.

    Details

    1962లో అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన డా.రాజేంద్ర ప్రసాద్

    1954లో సర్వేపల్లి రాధాకృష్ణన్, చక్రవర్తుల రాజగోపాలాచారి, డా.సి.వి.రామన్,

    1955లో డా. భగవాన్ దాస్, డా. మోక్షగుండం విశ్వేశ్వరయ్య, జవహర్ లాల్ నెహ్రూ,

    1957లో గోవింద్ వల్లభ్ పంత్,

    1958లో ధొండొ కేశవ కార్వే,

    1961లో డా. బీ.సీ.రాయ్, పురుషోత్తమ దాస్ టాండన్,

    1962లో డా. రాజేంద్ర ప్రసాద్,

    1963లో డా. జాకీర్ హుస్సేన్, పాండురంగ వామన్ కానే,

    1966లో లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం),

    1971లో ఇందిరాగాంధీ,

    1975లో వీ.వీ.గిరి,

    1976లో కామరాజ్ నాడార్ (మరణానంతరం),

    1980లో మదర్ థెరీసా,

    1983లో ఆచార్య వినోబా భావే (మరణానంతరం),

    1987లో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్,

    1988లో ఎంజీ రామచంద్రన్ (మరణానంతరం),

    1990లో బి.ఆర్.అంబేద్కర్ (మరణానంతరం), నెల్సన్ మండేలా,

    details

    మరణానంతరం ఎవరెవరికంటే..

    1991లో రాజీవ్ గాంధీ (మరణానంతరం), సర్దార్ వల్లభాయి పటేల్ (మరణానంతరం), మొరార్జీ దేశాయి,

    1992లో మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ (మరణానంతరం), జే.ఆర్.డీ.టాటా, సత్యజిత్ రే,

    1997లో ఏ.పి.జె.అబ్దుల్ కలాం, గుర్జారీలాల్ నందా, అరుణా అసఫ్ అలీ (మరణానంతరం),

    1998లో ఎం.ఎస్.సుబ్బులక్ష్మి, సి.సుబ్రమణ్యం, జయప్రకాశ్ నారాయణ్,

    1999లో రవి శంకర్, అమర్త్య సేన్, గోపీనాథ్ బొర్దొలాయి,

    2001లో లతా మంగేష్కర్, బిస్మిల్లా ఖాన్,

    2008లో భీమ్ సేన్ జోషి,

    2014లో సచిన్ టెండూల్కర్, సి.ఎన్.ఆర్.రావు,

    2015లో మదన్ మోహన్ మాలవ్యా, అటల్ బిహారీ వాజపేయి,

    2019లో నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం), కళాకారుడు డాక్టర్ భూపేన్ హజారికా (మరణానంతరం), మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలకు ఈ అవార్డును ప్రదానం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్
    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ
    Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి
    ISIS: ముంబయి ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్టు జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025