Page Loader
Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 30 నుంచి ప్రారంభం.. ఈసారి భక్తుల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు
చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 30 నుంచి ప్రారంభం.. ఈసారి భక్తుల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు

Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర ఏప్రిల్ 30 నుంచి ప్రారంభం.. ఈసారి భక్తుల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 11, 2025
03:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించేందుకు భక్తులు చేపట్టే యాత్రే 'చార్ ధామ్ యాత్ర' ప్రతేడాది లక్షలాది మంది హిందూ భక్తులు పాల్గొనే ఈ పవిత్ర యాత్రను 2024లో 30 లక్షలకు పైగా భక్తులు చేపట్టారు. ఇక 2025లో ఈ యాత్ర ఏప్రిల్ 30వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. యాత్ర తేదీలు ఇదే విధంగా ఉన్నాయి ఏప్రిల్ 30: యమునోత్రి, గంగోత్రి ఆలయాలు తెరుచుకోనున్నాయి మే 2: కేదారనాథ్ ఆలయం ప్రారంభం మే 4: బద్రీనాథ్ ఆలయం భక్తులకు దర్శనం అందించనుంది

Details

ఇక మూసే తేదీలు

అక్టోబర్ 22: యమునోత్రి ఆలయం మూసివేయనుంది అక్టోబర్ 23: గంగోత్రి, కేదారనాథ్ మూత పడనున్నాయి నవంబర్ 6: బద్రీనాథ్ ఆలయం మూసివేయనుంది ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చార్ ధామ్ యాత్రలో పాల్గొనదలచిన భక్తులు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం భక్తులు తమ ఇమెయిల్, మొబైల్ నంబర్, ఆధార్, పాన్, ఓటర్ ID లాంటివి అప్లోడ్ చేయాలి. అలాగే తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కూడా అవసరం. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక, ఈ-పాస్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Details

ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా 

ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను భక్తులు ఉత్తరాఖండ్‌లోని ముఖ్య కేంద్రాలైన దెహ్రాడూన్, హరిద్వార్, గుప్తకాశి, సోన్‌ప్రయాగ్‌లలో చేసుకోవచ్చు. అవసరమైన డాక్యుమెంట్లు, మెడికల్ సర్టిఫికేట్, ఫోటో సమర్పించడం ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే 13.5 లక్షల మంది రిజిస్టర్ గర్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తాజా సమాచారం ప్రకారం, ఈసారి భక్తుల సంఖ్యపై ఎలాంటి పరిమితి విధించలేదని తెలిపారు. ట్రాఫిక్, తాగునీరు, పార్కింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. యాత్ర మార్గాన్ని 10 కి.మీ.ల విభాగాలుగా చీల్చి, అధికారుల్ని బైక్‌లపై వాకీటాకీలతో నిఘా పెట్టేలా ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు.

Details

చార్ ధామ్ ఆలయాల ప్రాముఖ్యత 

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ, యాత్ర ప్రారంభానికి ముందే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తిచేయాలని భక్తులకు సూచించారు. రద్దీని తగ్గించి, సులభంగా యాత్ర సాగించేందుకు ఇది సహాయకరమవుతుందని పేర్కొన్నారు. యమునోత్రి: చార్ ధామ్ యాత్ర మొదలయ్యే ప్రథమ ఆలయం. దేవి యమునాదేవికి అంకితమైనది. గంగోత్రి: గంగాదేవికి అంకితమైన ఆలయం. యాత్రలో రెండో దశలో వస్తుంది. కేదారనాథ్: శివుడికి అంకితమైన పుణ్యక్షేత్రం. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. బద్రీనాథ్: చార్ ధామ్ యాత్రకు ముగింపు ఆలయం. విష్ణువుకు బద్రినారాయణ రూపంలో అంకితం.