NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Avoid These Combo : ఈ 5 ఆహారాలను కలిపి తింటే అంతే సంగతులు
    తదుపరి వార్తా కథనం
    Avoid These Combo : ఈ 5 ఆహారాలను కలిపి తింటే అంతే సంగతులు
    Avoid These Combo: ఈ 5 ఆహారాలను కలిపి తింటే తీవ్ర అనారోగ్యకరం

    Avoid These Combo : ఈ 5 ఆహారాలను కలిపి తింటే అంతే సంగతులు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 25, 2023
    03:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శరీరానికి కావాల్సిన శక్తి ఆహార పదర్థాల ద్వారానే సమకూరుతుంది. అలాంటి ఆహారం సరైన రీతిలో తీసుకుంటేనే తిన్నది సరిగ్గా జీర్ణం అవుతుంది.

    అయితే పలురకాల ఆహారాలను కలిపి తీసుకుంటే శరీరానికి అసౌకర్యం. దీంతో పాటు అనారోగ్యమని పోషక ఆహార నిపుణులు చెబుతుంటారు.

    నారింజ, నిమ్మ లాంటి సిట్రస్ పండ్లలో యాసిడ్ అధిక స్థాయిలో ఉంటుంది. దీంతో పలు రకాల పదార్థాలను కలిపి తీసుకుంటే ఆరోగ్య దెబ్బతింటుందని నిపుణలు చెబుతున్నారు.

    ఈ ఫుడ్ కాంబోకు గుడ్ బై చెప్పాలి :

    1. పండ్లను ఉదయం పూట అల్పాహారంగా విడిగా తీసుకోవాలి.ఆహారం, పండ్లు తీసుకునే సమయంలో రెండింటి మధ్య తగిన గ్యాప్ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. భోజనం చేసిన గంటకు పండ్లు తినటం బెస్ట్.

    details

    తక్కువ కొవ్వులు కలిగిన మాంసాన్నే తినేందుకు ఎంచుకోవాలి

    2. కొవ్వు కలిగిన మాంసంతో, వెన్నె తీసుకుంటే సంతృప్త కొవ్వు, సోడియం స్థాయిలు అధికంగా పెరుగుతాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని రెట్టిస్తుంది.

    ఫలితంగా మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ఆహారాన్ని సమతుల్యం చేయడానికి తక్కువ కొవ్వులు కలిగిన మాంసాన్నే తినేందుకు ఎంచుకోవాలి.

    3. సిట్రస్ పండ్లు - నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లలో యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. పాలతో పాటు ఈ పండ్లు కలిపి తింటే, పాలు గడ్డకట్టి జీర్ణ సమస్యలు మొదలవుతాయి.

    అందుకే వీటిని తీసుకునే విషయంలో తగినంత గ్యాప్ ఇవ్వాలి.

    details

    ఈ రెండు కలిపి తిన్నప్పుడు, శరీరం ఈ రెండు పోషకాలను ఏకకాలంలో గ్రహించలేదు

    4. ఐరన్ సహా కాల్షియం మనిషి శరీరానికి కావాల్సిన కంపల్సరీ మినరల్స్. అయితే ఈ రెండు కలిపి తిన్నప్పుడు, శరీరం ఈ రెండు పోషకాలను ఏకకాలంలో గ్రహించలేదు.

    అలా కాకుండా ఈ రెండింటినీ బాగా గ్రహించాలంటే విటమిన్ 'C'తో ఐరన్, విటమిన్ డితో కాల్షియం కలిసి ఉన్న ఆహారాలనే స్వీకరించాలి.

    5. చేపలతో పాలు మాంసాహారంతో పాలు, అనుబంధ ఉత్పత్తులను కలిపి తీసుకోవడం మంచిది కాదు. పాలతో మాంసాన్ని కలపడం శరీరానికి చాలా హానికరమని ఆహార నిపుణలు హెచ్చరిస్తున్నారు.

    ఇలాంటి ఆహారా విధానాలు కొన్నిసార్లు అనుకోని ఉపద్రవాలను తెచ్చిపెడతాయి. ఫలితంగా మానవ దేహాన్ని ఆరోగ్య సంక్షోభంలోకి నెట్టెస్తాయి.

    అందువల్ల ఆయా కాంబోలను తినకపోవడమే ఉత్తమమని పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆహారం

    తాజా

    Warangal Railway Station: ఆధునిక సౌకర్యాలతో సుందరంగా మారిన వరంగల్ స్టేషన్‌ వరంగల్ తూర్పు
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్
    Telangana: తెలంగాణా రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు పునః ప్రారంభం.. విశేషాలివే  తెలంగాణ
    IPL 2025: ఆర్సీబీ జట్టులో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్‌కి అవకాశం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    ఆహారం

    ఆహారానికి సంబంధించిన విషయాల్లో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసే గిన్నిస్ రికార్డ్స్  జీవనశైలి
    ఒక రోజులో మన శరీరానికి ఎన్ని కార్బోహైడ్రేట్లు అవసరమవుతాయో మీకు తెలుసా?  జీవనశైలి
    ఇమ్యూనిటీ పెంచడం నుండి ఎముకలను దృఢంగా చేయడం వరకు గుమ్మడి విత్తనాల ప్రయోజనాలు జీవనశైలి
    మహాభారతంలో పేర్కొన్న వంటకాలు ఇప్పటికీ ఇంట్లో తయారు చేస్తారని మీకు తెలుసా?  జీవనశైలి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025