Happy Diwali 2023: దీపావళి రోజున ఏం చేయాలి? అస్సలు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం
దీపావళి భారతదేశం అంతటా ఎంతో వైభవంగా, ఆనందంగా జరుపుకునే పండగ. దీపావళి రోజు రాత్రి లక్ష్మీ-గణేశుని ఆరాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. మంచి మనస్సుతో పూజిస్తే లక్ష్మీ దేవి, గణేశుడి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతుంటారు. ఈ ఇద్దరి దేవతామూర్తుల అనుగ్రహం లభించాలంటే దీపావళి రోజు ఏం చేయాలి? చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి కచ్చితంగా చేయాలి దీపావళి రోజున ఉదయం స్నానం చేయాలి. పగటిపూట ఇంటిని అలంకరించాలి. మీ పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి. సాయంత్రం పూజకు ముందు స్నానం చేయాలి. ఆచారాల ప్రకారం లక్ష్మీగణేశుని పూజించాలి. వ్యాపార సంస్థల్లో పూజలు చేయాలి. గడ్డిని పూజించాలి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలగించడం మాత్రం మరిచిపోవద్దు.
దీపావళి రోజున ఇవి అస్సలు చేయొద్దు
దీపావళి రోజున ఇంటి ముఖద్వారం వద్ద లేదా ఇంటి లోపల మురికిగా ఉంచొద్దు. దీపావళి రోజున పేదలకు సాయం చేయండి దీపావళి నాడు జూదం ఆడొద్దు. మద్యం సేవించొద్దు. మాంసాహారం తీసుకోవద్దు. ట్రంకు పెట్టె కుడి వైపున వినాయకుడి విగ్రహాన్ని ఉంచొద్దు. తోలు, పదునైన వస్తువులు, క్రాకర్లతో చేసిన బహుమతులు ఎవరికీ ఇవ్వవద్దు. దీపావళి రోజున అప్పు ఇవ్వకండి లేదా తీసుకోకండి. రాత్రిపూట పూజ గదిలో దీపం నిత్యం వెలిగేలా చూసుకోవాలి. ఆ దీపం రాత్రంతా మండుతూనే ఉండేలా చూసుకోవాలి. దీపావళి రోజున ఇలా చేయడం వల్ల లక్ష్మి-గణేశుడు, కుబేరుడు సంతోషిస్తారని పురాణాలు చెబుతున్నాయి. తద్వారా సంపద వస్తుందని నమ్ముతుంటారు.