NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / రైల్వే ట్రాక్‌ను సులభంగా దాటుతున్న ఏనుగులు.. అధికారులు వినూత్న ఏర్పాటు (వీడియో వైరల్) 
    రైల్వే ట్రాక్‌ను సులభంగా దాటుతున్న ఏనుగులు.. అధికారులు వినూత్న ఏర్పాటు (వీడియో వైరల్) 
    లైఫ్-స్టైల్

    రైల్వే ట్రాక్‌ను సులభంగా దాటుతున్న ఏనుగులు.. అధికారులు వినూత్న ఏర్పాటు (వీడియో వైరల్) 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    June 01, 2023 | 10:00 am 0 నిమి చదవండి
    రైల్వే ట్రాక్‌ను సులభంగా దాటుతున్న ఏనుగులు.. అధికారులు వినూత్న ఏర్పాటు (వీడియో వైరల్) 
    రైల్వే ట్రాకును దాటుతున్న ఏనుగులు

    అటవీ ప్రాంతంలో ఉండే రైల్వే ట్రాకును దాటేటప్పుడు కొన్ని ఏనుగులు గాయపడడం, చనిపోవడం లాంటి ఎన్నో ఘటనలను చూస్తుంటాం. గజరాజుల గుంపును గమనించి లోకో పైలట్లు రైలు బ్రేకులు వేస్తున్నప్పటికీ అప్పటికే సమయం మించిపోయి ప్రమాదాలు జరిగిపోతున్నాయి. అయితే వీటిని నివారించేందుకు అధికారులు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వివిధ ప్రాంతాల్లో క్రాసింగ్స్ ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించేలా అధికారులు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అస్సాం అటవీశాఖ అధికారులు ఏనుగులను దాటించేందుకు వినూత్న ఆలోచన చేశారు. ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ దాటేందుకు అధికారులు ఓ ర్యాంప్ ను ఏర్పాటు చేశారు. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో రీషేర్ చేసిన వీడియో ప్రస్తుతం జంతుప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటోంది.

    గ్రీన్ కారిడార్ గా ప్రకటించాలి

    ఈ వీడియోలో ఏనుగులు సులభంగా, సురక్షితంగా రైల్వే ట్రాక్ ను దాటేందుకు అధికారులు ఏర్పాటు చేసిన ర్యాంప్ మనకు కనిపిస్తుంది. ఏనుగులు గుంపు రాణి రిజర్వ్ ఫారెస్టును చేరుకునేందుకు డీపర్ బీల్ నుంచి మికిర్పర కారిడార్ ను దాటుతున్నాయని ఒరిజినల్ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు. ముఖ్యంగా రైల్వే ట్రాకులపై ఏనుగుల మరణాలను తగ్గించేందుకు సమర్ధవంతమైన ఏర్పాటు అని సుశాంత నంద ఈ పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టు ఆన్‌లైన్‌లో షేర్ చేసిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. ఏనుగులు నిత్యం ఉపయోగించే ఈ మార్గాలను గ్రీన్ కారిడార్ గా ప్రకటించాలని కొందరు నెటిజన్లు సూచించారు.

    రైల్వే ట్రాకును దాటుతున్న ఏనుగుల గుంపు

    An effective way to reduce elephant deaths on Railway tracks. Ramp for the gentle giants to cross the tracks is a much simpler way to reduce the conflict.
    Source:Assam FD pic.twitter.com/VZfwPjfwHG

    — Susanta Nanda (@susantananda3) May 31, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    భారతదేశం
    రైలు ప్రమాదం

    భారతదేశం

    Indian Economy: ఆర్థిక వ్యవస్థలో భారత్ దూకుడు.. మోర్గాన్ స్టాన్లీ ప్రశంసలు ప్రధాన మంత్రి
    కొత్త పార్లమెంట్‌లో 'అఖండ భారత్‌' మ్యాప్; నేపాల్ అభ్యంతరం  నేపాల్
    150 మెడికల్ కాలేజీల గుర్తింపును రద్దు చేసే యోచనలో ఎన్ఎంసీ  గుజరాత్
    దిల్లీలో 16ఏళ్ల బాలిక దారుణ హత్య; 20సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు; వీడియో వైరల్  దిల్లీ

    రైలు ప్రమాదం

    వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు  ఉత్తర్‌ప్రదేశ్
    కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు  కేరళ
    మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి  మధ్యప్రదేశ్
    ఒడిశా రైలు ప్రమాదంలో 237 మంది దుర్మరణం; 900మందికి గాయాలు  ఒడిశా
    తదుపరి వార్తా కథనం

    లైఫ్-స్టైల్ వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Lifestyle Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023