NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / రైల్వే ట్రాక్‌ను సులభంగా దాటుతున్న ఏనుగులు.. అధికారులు వినూత్న ఏర్పాటు (వీడియో వైరల్) 
    తదుపరి వార్తా కథనం
    రైల్వే ట్రాక్‌ను సులభంగా దాటుతున్న ఏనుగులు.. అధికారులు వినూత్న ఏర్పాటు (వీడియో వైరల్) 
    రైల్వే ట్రాకును దాటుతున్న ఏనుగులు

    రైల్వే ట్రాక్‌ను సులభంగా దాటుతున్న ఏనుగులు.. అధికారులు వినూత్న ఏర్పాటు (వీడియో వైరల్) 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 01, 2023
    10:00 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అటవీ ప్రాంతంలో ఉండే రైల్వే ట్రాకును దాటేటప్పుడు కొన్ని ఏనుగులు గాయపడడం, చనిపోవడం లాంటి ఎన్నో ఘటనలను చూస్తుంటాం.

    గజరాజుల గుంపును గమనించి లోకో పైలట్లు రైలు బ్రేకులు వేస్తున్నప్పటికీ అప్పటికే సమయం మించిపోయి ప్రమాదాలు జరిగిపోతున్నాయి. అయితే వీటిని నివారించేందుకు అధికారులు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

    వివిధ ప్రాంతాల్లో క్రాసింగ్స్ ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించేలా అధికారులు కృషి చేస్తున్నారు.

    ఈ నేపథ్యంలో అస్సాం అటవీశాఖ అధికారులు ఏనుగులను దాటించేందుకు వినూత్న ఆలోచన చేశారు. ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ దాటేందుకు అధికారులు ఓ ర్యాంప్ ను ఏర్పాటు చేశారు.

    ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో రీషేర్ చేసిన వీడియో ప్రస్తుతం జంతుప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటోంది.

    Details

    గ్రీన్ కారిడార్ గా ప్రకటించాలి

    ఈ వీడియోలో ఏనుగులు సులభంగా, సురక్షితంగా రైల్వే ట్రాక్ ను దాటేందుకు అధికారులు ఏర్పాటు చేసిన ర్యాంప్ మనకు కనిపిస్తుంది.

    ఏనుగులు గుంపు రాణి రిజర్వ్ ఫారెస్టును చేరుకునేందుకు డీపర్ బీల్ నుంచి మికిర్పర కారిడార్ ను దాటుతున్నాయని ఒరిజినల్ పోస్టుకు క్యాప్షన్ ఇచ్చారు.

    ముఖ్యంగా రైల్వే ట్రాకులపై ఏనుగుల మరణాలను తగ్గించేందుకు సమర్ధవంతమైన ఏర్పాటు అని సుశాంత నంద ఈ పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చారు. ఈ పోస్టు ఆన్‌లైన్‌లో షేర్ చేసిన కొద్దిసేపటికే వైరల్‌గా మారింది.

    ఏనుగులు నిత్యం ఉపయోగించే ఈ మార్గాలను గ్రీన్ కారిడార్ గా ప్రకటించాలని కొందరు నెటిజన్లు సూచించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రైల్వే ట్రాకును దాటుతున్న ఏనుగుల గుంపు

    An effective way to reduce elephant deaths on Railway tracks. Ramp for the gentle giants to cross the tracks is a much simpler way to reduce the conflict.
    Source:Assam FD pic.twitter.com/VZfwPjfwHG

    — Susanta Nanda (@susantananda3) May 31, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    రైలు ప్రమాదం

    తాజా

    Andhra News: డిగ్రీ కోర్సుల్లో కీలక మార్పులు - కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్ వంటి కోర్సులకు ప్రవేశం  ఆంధ్రప్రదేశ్
    Maharashtra: ఫడ్నవిస్ మంత్రివర్గంలో భుజ్‌బాల్.. ఇవాళే ప్రమాణ స్వీకారం మహారాష్ట్ర
    Vishal-Sai Dhansika: విశాల్‌ పెళ్లికి ముహూర్తం ఫిక్స్‌.. బర్త్‌డే రోజునే వెడ్డింగ్‌ విశాల్
    Hyderabad: ఔటర్‌ రింగ్‌ రోడ్డు-ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య లాజిస్టిక్‌ హబ్‌ల నిర్మాణం లక్ష్యంగా హెచ్‌ఎండీఏ ప్రణాళిక  హైదరాబాద్

    భారతదేశం

    ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్; చైనా కంటే 2.9 మిలియన్లు ఎక్కువ చైనా
    మే నెలలో భారత్‌కు రానున్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి; 2014 తర్వాత వస్తున్న తొలి నాయకుడు పాకిస్థాన్
    'జాతీయ సివిల్ సర్వీసెస్ డే 2023'ను ఎందుకు జరుపుకుంటారు? ప్రాముఖ్యతను తెలుసుకోండి  కలెక్టర్
    సూడాన్‌లో చిక్కుకుపోయిన 4వేలమంది భారతీయులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం  సూడాన్

    రైలు ప్రమాదం

    మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి  మధ్యప్రదేశ్
    కోజికోడ్ రైలు దహనం కేసు: కేరళ ఐపీఎస్ అధికారిపై సస్పెన్షన్ వేటు  కేరళ
    వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు  ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025