Page Loader
Andhra Pradesh Formation Day: నిరాహార దీక్షతో 'ఆంధ్రప్రదేశ్‌' ఆవిర్భావం.. 1956లో జరిగిన చరిత్ర ఇదే!
నిరాహార దీక్షతో 'ఆంధ్రప్రదేశ్‌' ఆవిర్భావం.. 1956లో జరిగిన చరిత్ర ఇదే!

Andhra Pradesh Formation Day: నిరాహార దీక్షతో 'ఆంధ్రప్రదేశ్‌' ఆవిర్భావం.. 1956లో జరిగిన చరిత్ర ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 28, 2024
04:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

1956లో రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడింది. భారతదేశంలో భాషాపరంగా ఏర్పడిన మొదటి రాష్ట్రం ఇదే. తెలుగు అధికార భాషగా ఉంది. భారతదేశం తూర్పు తీరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ దక్షిణంలో తమిళనాడు, ఆగ్నేయాన కర్ణాటక, ఈశాన్యాన ఒడిశా, వాయువ్యాన తెలంగాణతో సరిహద్దులను పంచుకుంటుంది. భౌగోళిక పరంగా, 1.60 లక్షల కిలోమీటర్ల విస్తీర్ణంతో ఇది భారతదేశంలోనే ఏడవ అతిపెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రతేడాది నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటారు. ఆ రోజున రాష్ట్ర ఆవిర్భావాన్ని స్మరించుకుంటూ, ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక వారసత్వాన్ని, సంప్రదాయాలను ఘనంగా జరుపుకుంటారు.

Details

58 రోజుల నిరాహారదీక్ష

మద్రాస్‌ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను హైదరాబాద్‌ ప్రాంతాలతో కలిపి ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేయాలని ఉద్యమం జరిగింది. 1952లో తెలుగు రాష్ట్రం కోసం ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఉధృతమైంది. ఆ ఉద్యమంలో భాగంగా ప్రముఖ విప్లవకారుడు పొట్టి శ్రీరాములు, తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు అనకూలంగా నిరాహారదీక్ష చేపట్టారు. శ్రీరాములు ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడంతో, 58 రోజుల నిరాహారదీక్ష అనంతరం ఆయన మరణించారు. ఈ ఘటన ఆంధ్ర ప్రాంతంలో తీవ్ర అలజడిని రేపింది. దీంతో ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. 1953 అక్టోబర్ 1న కర్నూలును రాజధానిగా క్రమంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు.

Details

1956లో హైదరాబాద్ తో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు

1956 నవంబర్ 1న రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ చట్టం కింద ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక పాంప్రదాయాలు, కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యం, వంటకాలతో ప్రసిద్ధి చెందింది. 2014లో తెలంగాణ విడిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆపేశారు. చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం ఈ చారిత్రక దినోత్సవాన్ని జాతీయం చేయలేదని నిరసనలో భాగంగా ఈ సెలబ్రేషన్స్‌ను ఆపింది. 2019లో జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక, ఈ సంబరాలను మళ్లీ ప్రారంభించింది. తెలంగాణ 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం విడిపోవడంతో తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడింది.