Page Loader
Maha Kumbh Mela Special Trains : కుంభమేళా ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. చర్లపల్లి నుంచి స్పెషల్ ట్రైన్లు
కుంభమేళా ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. చర్లపల్లి నుంచి స్పెషల్ ట్రైన్లు

Maha Kumbh Mela Special Trains : కుంభమేళా ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. చర్లపల్లి నుంచి స్పెషల్ ట్రైన్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 29, 2025
02:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహా కుంభమేళా యాత్రికులకు దక్షిణ మధ్య రైల్వే బోర్డు మరో శుభవార్త అందించింది. భక్తుల అధిక డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.

హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు.

చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్ల వివరాలు

07079 ట్రైన్

ఫిబ్రవరి 5న మధ్యాహ్నం 3:00 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, రెండో రోజు రాత్రి 11:55 గంటలకు ధన్‌పూర్‌కు చేరుకుంటుంది.

07080 ట్రైన్

ఫిబ్రవరి 7న ధన్‌పూర్ నుంచి మధ్యాహ్నం 3:00 గంటలకు బయలుదేరి, రెండో రోజు రాత్రి 11:45 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

Details

07077 ట్రైన్ 

ఫిబ్రవరి7న మధ్యాహ్నం 3:00 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, రెండో రోజు రాత్రి 11:55 గంటలకు ధన్‌పూర్‌కు వస్తుంది.

07078 ట్రైన్

ఫిబ్రవరి9న ధన్‌పూర్ నుంచి మధ్యాహ్నం 3:00 గంటలకు బయలుదేరి, రెండో రోజు రాత్రి 11:45 గంటలకు చర్లపల్లికి రానుంది.

ఈ ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లు

తెలంగాణలో జనగాం, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్, కాగజ్‌నగర్ స్టేషన్లలో ఈ ప్రత్యేక రైళ్లు ఆగనున్నాయి.

ఇతర రాష్ట్రాల్లోని కొన్ని ప్రధాన స్టేషన్లలోనూ ఆగుతాయని రైల్వే అధికారులు తెలిపారు.

ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏ, 3ఏ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

భక్తులు ఈ సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే శాఖ సూచించింది.