NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / రాత్రుళ్ళు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? చూపు కోల్పోయిన హైదరాబాద్ అమ్మాయి కథ తెలుసుకోండి
    తదుపరి వార్తా కథనం
    రాత్రుళ్ళు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? చూపు కోల్పోయిన హైదరాబాద్ అమ్మాయి కథ తెలుసుకోండి
    స్మార్ట్ ఫోన్ వల్ల చూపు కోల్పోయిన హైదరాబాద్ అమ్మాయి

    రాత్రుళ్ళు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? చూపు కోల్పోయిన హైదరాబాద్ అమ్మాయి కథ తెలుసుకోండి

    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 10, 2023
    12:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జాబ్ లేదా టైమ్ పాస్ కోసమో స్మార్ట్ ఫోన్ వాడకం మరీ పెరిగిపోయింది. చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే జేబు దగ్గర గుండె లేదేమో అన్నట్లుగా ఫీలయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు.

    పొద్దునా, రాత్రి ఎప్పుడు పడితే కళ్ళను స్మార్ట్ ఫోన్ కి అప్పజెప్పేస్తున్నారు. దానివల్ల కళ్ళకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన 30ఏళ్ల మంజు, స్మార్ట్ ఫోన్ వాడకం వల్ల చూపు కోల్పోయింది.

    సంవత్సరంన్నర పాటు సరైన చూపు లేక చాలా బాధపడింది. ఈ విషయాలను డాక్టర్ సుధీర్ కుమార్ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

    కంటిచూపులో సమస్యగా ఉందనీ, వస్తువులను సరిగ్గా చూడలేకపోతున్నానని, అప్పుడప్పుడు గీతలు గీతలుగా కనిపిస్తున్నాయని తన వద్దకు మంజు వచ్చిందని డాక్టర్ చెప్పారు.

    ఆరోగ్యం

    చీకటి రాత్రిలో రోజూ రెండు గంటల ఫోన్ వాడకం వల్ల సమస్యలు

    కొన్నిసార్లు రాత్రుళ్ళు అస్సలు కనిపించకపోయేదని మంజు తెలిపిందనీ డాక్టర్ తెలిపారు. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించిన సుధీర్, ఆమె గతం గురించి తెలుసుకుని కంటిచూపు పోవడానికి కారణం కనుక్కున్నాడు.

    దివ్యాంగుడైన తన బిడ్డను చూసుకోవడానికి బ్యూటీషియన్ గా జాబ్ మానేసాక, ఎక్కువ సమయం ఖాళీ దొరకడంతో తరచుగా ఫోన్ వాడటం అలవాటైంది. అలా రాత్రుళ్ళు లైట్ ఆఫ్ చేసాక రెండు మూడు గంటలు ఫోన్ వాడేదట. దానివల్లే కంటిచూపు పోయిందని డాక్టర్ తెలుసుకున్నాడు.

    ఐతే ఆమెకు మందులకు బదులు, స్మార్ట్ ఫోన్ ని పూర్తిగా పక్కకు పెట్టమని డాక్టర్ సూచించడంతో నెలరోజుల పాటు ఫోన్ ముట్టలేదట. ఇప్పుడు కంటిచూపు తిరిగొచ్చిందని డాక్టర్ తెలియజేసారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025