LOADING...
IBM Employee: 15 సంవత్సరాలుగా సెలవులో ఉన్నాడు.. జీతం పెంచలేదని ఐబీఎం కంపెనీ పై దావా వేశాడు
జీతం పెంచలేదని ఐబీఎం కంపెనీ పై దావా వేశాడు

IBM Employee: 15 సంవత్సరాలుగా సెలవులో ఉన్నాడు.. జీతం పెంచలేదని ఐబీఎం కంపెనీ పై దావా వేశాడు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 22, 2026
04:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

సాధారణంగా ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగుల హక్కులు పరిమితమైనవే. సాప్ట్‌వేర్ రంగంలో పనిచేసే ఉద్యోగులకి కొన్ని హక్కులు ఉన్నప్పటికీ అవి అంతగా అమలు కావు. ఆర్థిక మాంద్యం వంటి పరిస్థితుల్లో కంపెనీలు ఉద్యోగి మెడ పట్టి బయటకి గెంటేస్తాయి వాళ్లకు ఇవ్వాల్సినప్రయోజనాలను ఇచ్చేసి చేతులు దులుపుకుంటాయి. ఇలాంటి వార్తలు నిన్న మొన్నటి వరకు మనం చాలానే చూశాం. కానీ తాజాగా ఒక ఐటి ఉద్యోగి ఐబీఎం కంపెనీని పై దావా వేశాడు. దానికి కారణం.. జీతం పెంచకపోవడమే. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వివరాలు 

ఐబీఎం కంపెనీలో ఘటన

ఐబీఎం లో సీనియర్ ఐటి ఉద్యోగి ఇయాన్ క్లిఫోర్డ్. అప్పట్లో అతడి జీతం ఐదు అంకెలలో ఉండేది. విలాసవంతమైన జీవితం గడిపేవాడు. కానీ 2008 సెప్టెంబరు నుండి అనారోగ్యంతో సిక్స్‌ లీవ్‌ పెట్టాడు. ఎన్ని ఆసుపత్రులలో చూపించినప్పటికీ అతనికి నయం కాలేదు 2013లో, కంపెనీ అతనికి అవసరమైన ప్రయోజనాలు ఇవ్వకపోవడం వల్ల ఇయాన్ కోపంతో బ్రిటన్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు తర్వాత, ఐబీఎం అతనికి కంపెనీలో ఉద్యోగం కొనసాగుతుందని హామీ ఇచ్చింది.

వివరాలు 

ఐబీఎం కంపెనీలో ఘటన

ఐబీఎం చట్టపరంగా అతను పని చేయకపోయినా, ఉద్యోగిగా పరిగణిస్తూ వేతనాన్ని 72,037 పౌండ్లలో 75% మేర, అంటే సంవత్సరానికి సుమారు 54,000 పౌండ్లు (భారతీయ కరెన్సీలో సుమారు 55.31 లక్షల రూపాయలు) చెల్లించేది. అతడి ఉద్యోగ విరమణ వయసు 65 సంవత్సరాలు అయ్యేవరకు ఈ వేతనం కొనసాగుతుందని ప్రకటించింది. 2013లో బ్రిటన్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినప్పుడు, ఐబీఎం పెద్దల ఆగ్రహానికి గురై, అదనంగా 8,685 పౌండ్లు (భారత కరెన్సీ లో సుమారు 9 లక్షలు) చెల్లించింది.

Advertisement

వివరాలు 

ఇయాన్ క్లిఫోర్డ్ మళ్లీ ఫిర్యాదు చేశాడు

గత దశాబ్దాలుగా లండన్‌లో జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో, ఐబీఎం ఇచ్చే వేతనం తక్కువగా ఉందని ఇయాన్ వాపోయాడు. తనకు ఇచ్చే వేతనం సంతృప్తికరంగా పెంచాలని డిమాండ్ చేసి, కంపెనీకి లేఖ రాశాడు. అయినప్పటికీ సమాధానం రాకపోవడంతో 2022 ఫిబ్రవరిలో బ్రిటన్ ఎంప్లాయ్మెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాడు. తన అనారోగ్యం పట్ల ఐబీఎం కంపెనీ వివక్ష చూపిస్తోందని ఆరోపించాడు. కోర్టులో ఐబీఎం తరపు న్యాయవాది వాదిస్తూ, "అతడికి మెరుగైన చికిత్స, కుటుంబ నిర్వహణ కోసం సరిపడా ఆర్థిక ప్యాకేజీ ఇచ్చాం" అని చెప్పారు.

Advertisement

వివరాలు 

ఇయాన్ క్లిఫోర్డ్ మళ్లీ ఫిర్యాదు చేశాడు

బ్రిటన్ కార్మిక చట్టాల ప్రకారం యాక్టివ్ ఉద్యోగులకి వేతన పెంపు ఉంటుంది, కానీ యాక్టివ్‌గా లేని ఉద్యోగులకు అది వర్తించదని న్యాయవాది వివరించారు. పెరుగుతున్న ధరల కారణంగా 10 సంవత్సరాల క్రితం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇచ్చే వేతనం సరిపోకపోవచ్చని కూడా చెప్పారు. అయినా, ఇయాన్ అనారోగ్యం దృష్ట్యా ఐబీఎం పెద్ద ఉదారతతో వ్యవహరిస్తోందని న్యాయవాది చెప్పాడు. అతడి అనారోగ్యాన్ని ఐబీఎం సంస్థ చిన్నచూపు చూసిందని ఆరోపించడంలో అర్థం లేదని ఐబీఎం తరఫున న్యాయవాది వాదించారు. అయినప్పటికీ, కోర్టు ఈ వాదనలు పరిశీలించిన తర్వాత, ఇయాన్ ఫిర్యాదును తిరస్కరించింది.

Advertisement