
వర్షాకాలంలో దోమల వల్ల కలిగే వ్యాధులు, వాటి లక్షణాలు తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
వర్షాలు ఎక్కువగా పడటం వల్ల దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. భూమి మీద నీరు నిల్వగా ఉండటం, పాడైపోయిన టైర్లలో నీళ్ళు చేరడం మొదలగు వాటివల్ల దోమలు ఎక్కువగా పుట్టుకొస్తాయి.
అందుకే దోమల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో దోమల వల్ల వచ్చే మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఆయా వ్యాధుల లక్షణాలను తెలుసుకుందాం.
చికున్ గున్యా:
దోమ కుట్టిన తర్వాత 4 నుండి 8రోజుల్లో ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే, తలనొప్పి, హఠాత్తుగా అధిక జ్వరం, వాంతులు, వికారం, కండ్ల కలక, దద్దుర్లు, కీళ్ళ నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Details
ప్రాణాంతకంగా మారే మలేరియా, వ్యాధులు
మలేరియా:
ఆడ ఎనాఫిలిస్ దోమ కాటు కారణంగా మలేరియాకు కారణమయ్యే పరాన్నజీవులు మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తాయి.
మలేరియా సోకిన వారిలో తీవ్రమైన చలి, జ్వరం, వికారం, తలనొప్పి, వాంతులు, డయేరియా, కడుపు నొప్పి, కీళ్ళనొపులు, అలసట, శ్వాస వేగం పెరగడం, గుండె కొట్టుకునే వేగం పెరగడం, దగ్గు ఉంటాయి.
డెంగ్యూ:
దోమకాటు తర్వాత 4 నుండి 10రోజులకు డెంగ్యూ లక్షణాలు కనిపిస్తాయి. 104ఫారెన్ హీట్ ఉష్ణోగ్రతతో కూడిన జ్వరం, తలనొప్పి, ఎముకలు, కండరాలు, కీళ్ళ నొప్పులు, కళ్ళ వెనక నొప్పి, చర్మం మీద దద్దుర్లు, వికారం, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి.
ఈ వ్యాధులు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.