LOADING...
Alcohol: మద్యం మానేస్తే శరీరం మళ్లీ కోలుకుంటుందా..? శాస్త్రవేత్తల కీలక అధ్యయనం
మద్యం మానేస్తే శరీరం మళ్లీ కోలుకుంటుందా..? శాస్త్రవేత్తల కీలక అధ్యయనం

Alcohol: మద్యం మానేస్తే శరీరం మళ్లీ కోలుకుంటుందా..? శాస్త్రవేత్తల కీలక అధ్యయనం

వ్రాసిన వారు Sirish Praharaju
May 14, 2026
04:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని తెలిసిందే. అయితే తాజాగా శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. స్నేహితులతో పార్టీలు, ఒత్తిడి తర్వాత రిలాక్స్ కోసం ఒక గ్లాస్ వైన్ లేదా బీర్ తాగడం సాధారణంగా కనిపించినా.. ఇవి శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మద్యం కారణంగా శరీర రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, క్యాన్సర్, గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు, మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శాస్త్రవేత్తల ప్రకారం మద్యం నేరుగా 62రకాల వ్యాధులకు కారణమవుతోంది. వీటిలో ఫ్యాటీ లివర్,ప్యాంక్రియాటైటిస్, గ్యాస్ట్రిటిస్, అల్సర్లు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయి. అంతేకాదు బ్రెస్ట్ క్యాన్సర్, స్ట్రోక్, డిమెన్షియా,డయాబెటిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా ఇది పెంచుతుంది.

వివరాలు 

సరైన సమయంలో మద్యం మానేస్తే..

ఒక్కసారి మద్యం తాగినా 20 నిమిషాల్లోనే శరీర రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇందులో ఒక సానుకూల విషయం కూడా ఉందని పరిశోధకులు అంటున్నారు. సరైన సమయంలో మద్యం మానేస్తే శరీరానికి జరిగిన నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చని వెల్లడించారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి కొన్ని రోజుల్లో తిరిగి మెరుగుపడే అవకాశం ఉందని చెబుతున్నారు. మెదడు పనితీరు, జ్ఞాపకశక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా క్రమంగా మెరుగుపడవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

వివరాలు 

రోజుకు ఒక డ్రింక్ రక్తపోటు పెరగడానికి కారణం 

మద్యం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని అమెరికా ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, పురుషుల్లో కొలొరెక్టల్ క్యాన్సర్‌కు మద్యం ప్రధాన కారణాల్లో ఒకటిగా గుర్తించారు. మద్యం మానేస్తే భవిష్యత్తులో వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యానికి మద్యం మంచిదనే అభిప్రాయంపై కూడా ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోజుకు ఒక డ్రింక్ కూడా రక్తపోటు పెరగడానికి కారణమవుతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా అధిక మద్యం సేవించే వారిలో కాలేయం, మెదడు, గుండెపై దీర్ఘకాలిక ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వైద్యులు తెలిపారు.

Advertisement