NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు /  Korralu: ఐదేళ్ల లోపు చిన్నారులకు కొర్రలతో పోషకాహార లోపానికి చెక్‌!
    తదుపరి వార్తా కథనం
     Korralu: ఐదేళ్ల లోపు చిన్నారులకు కొర్రలతో పోషకాహార లోపానికి చెక్‌!
    ఐదేళ్ల లోపు చిన్నారులకు కొర్రలతో పోషకాహార లోపానికి చెక్‌!

     Korralu: ఐదేళ్ల లోపు చిన్నారులకు కొర్రలతో పోషకాహార లోపానికి చెక్‌!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 18, 2024
    09:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐదేళ్ల లోపు చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు కొర్రల ఆహారాన్ని తినిపించడం అనేది ఆరోగ్యకరమైన పరిష్కారమని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్లాంట్ సైన్సెస్ విభాగం పరిశోధకులు నిర్ధారించారు.

    డాక్టర్ ముతమిలరసన్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం ఈ దిశగా చేసిన పరిశోధన విజయవంతమైంది.

    వీరు ఇక్రిశాట్‌ నుంచి 155 రకాలు, దిల్లీ నుంచి 185 రకాలు కొర్రలను సేకరించి, జీనోమ్ కోడ్ ఎడిటింగ్‌ పద్ధతిలో ఫైటిక్‌ యాసిడ్‌ను తగ్గించేందుకు ప్రయత్నించారు.

    ఫలితంగా 155 రకాల్లో 70 శాతం, 185 రకాల్లో 81 శాతం ఫైటిక్ యాసిడ్ తగ్గిందని నిర్ధారించారు.

    తదుపరి, ఈ కొత్తరకం కొర్రలను సాగు చేసి ప్రయోగశాలలో పరీక్షించారు, అప్పుడు ఫైటిక్ యాసిడ్‌ గణనీయంగా తగ్గినట్లు తెలిసింది.

    వివరాలు 

    చిన్నారులకు ఈ ప్రయోజనం ఎలా? 

    ఈ పరిశోధనకు కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ అనుమతి ఇచ్చింది.

    సాధారణంగా కొర్రల్లో ఉన్న ఫైటిక్‌ యాసిడ్‌ జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. అయితే, ఫైటిక్‌ యాసిడ్‌ తగ్గించడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుందనీ, దీంతో చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించవచ్చని పరిశోధకులు తెలిపారు.

    జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రల లాంటి పంటల ప్రయోజనాలను అర్థం చేసుకునేందుకు డాక్టర్ ముతమిలరసన్ బృందం మూడేళ్లుగా పరిశోధనలు చేపట్టింది.

    2023లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక ప్రకారం, భారత్‌లో ఐదేళ్ల లోపు చిన్నారుల సంఖ్య 5.32 కోట్లుగా గుర్తించారు.

    ఈ వివరాల ఆధారంగా, పోషకాహార లోపాన్ని తగ్గించడంపై ఫోకస్ చేస్తూ ఈ పరిశోధనను అభివృద్ధి చేశారు.

    వివరాలు 

    కేంద్ర సంస్థల అనుమతి రాగానే.. 

    వీరు అభివృద్ధి చేసిన కొత్తరకం కొర్రలతో ఉప్మా లేదా జావ రూపంలో వారానికి మూడుసార్లు ఆరునెలలు పాటు ఆహారం అందిస్తే, చిన్నారుల్లో పోషకాహార లోపం తగ్గి, సాధారణంగా ఎదగగలరని నిర్ధారణకు వచ్చారు.

    ఈ కొత్త కొర్ర వంగడాల సాగుకు కేంద్ర సంస్థల అనుమతి రాగానే రెండేళ్లలో మార్కెటింగ్ చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    తెలంగాణ

    Earthquakes:తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన స్వల్ప భూప్రకంపనలు  భూకంపం
    Regional Ring Road: రీజినల్ రింగ్ రోడ్డుకి 72.35 హెక్టార్ల అప్పగింతకు కేంద్రం ఆమోదం భారతదేశం
    Telangana: యాసంగికి 365 టీఎంసీల కేటాయింపు.. నీటిపారుదల శాఖ నిర్ణయం  భారతదేశం
    Telangana: తెలంగాణ ప్రభుత్వం, గూగుల్ మధ్య కీలక ఒప్పందం.. గూగుల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025