NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Papikondalu: దసరా సెలవుల్లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? బెస్ట్ ఛాయిస్ పాపికొండలు టూర్
    తదుపరి వార్తా కథనం
    Papikondalu: దసరా సెలవుల్లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? బెస్ట్ ఛాయిస్ పాపికొండలు టూర్
    దసరా సెలవుల్లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? బెస్ట్ ఛాయిస్ పాపికొండలు టూర్

    Papikondalu: దసరా సెలవుల్లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? బెస్ట్ ఛాయిస్ పాపికొండలు టూర్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 04, 2024
    04:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంలో, కుటుంబ సమేతంగా సందర్శించదగ్గ అనేక పర్యాటక ప్రాంతాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నాయి.

    సువిశాల గోదావరి నది తీరం కలిగిన ఈ జిల్లాలో, ఎత్తైన కొండలు, పచ్చని వృక్షాలు, అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం కలగలసిన ప్రదేశాలు ఉన్నాయి.

    రోజువారీ ఒత్తిడిని తగ్గించుకుని, ప్రశాంతమైన పర్యాటక ప్రాంతాన్ని సందర్శించాలనుకునే వారు ఎక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపై ఆసక్తి చూపుతుంటారు.

    భద్రాద్రి కొత్తగూడెంలో ఎన్ని పర్యాటక ప్రదేశాలు ఉన్నపటికీ.. అందరికి ముందుగా గుర్తువచ్చేది మాత్రం పాపికొండలే.

    వివరాలు 

    సెలవు రోజుల్లో అయితే వెయ్యి మందికి పైగా పాపికొండలను సందర్శిస్తారు

    పాపికొండలు, గోదావరి నది రెండు వైపులా విస్తరించి ఉండే ఒక అందమైన ప్రాంతం.

    ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తూ, పాపికొండలు,నది పక్కన ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు.

    వీఆర్‌పురం మండలంలోని పోచవరం బోట్ పాయింట్ నుంచి రోజుకు సుమారు 300 మంది పర్యాటకులు, సెలవు రోజుల్లో అయితే వెయ్యి మందికి పైగా పాపికొండలను సందర్శించేందుకు వస్తున్నారు.

    ఈ ప్రాంతం, నిత్య జీవిత ఒత్తిడుల నుంచి విముక్తిని పొందాలనుకునే పర్యాటకులకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

    తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న పాపికొండలు బోటు షికారు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు.

    వివరాలు 

    పోచవరం బోట్ పాయింట్‌కు రోడ్డు మార్గం

    భద్రాచలం రామాలయాన్ని దర్శించిన తరువాత, 75 కిలోమీటర్ల దూరంలోని పోచవరం బోట్ పాయింట్‌కు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.

    అక్కడి నుంచి గోదావరి నదిలో బోటు ప్రయాణం ప్రారంభమవుతుంది. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని పోశమ్మ గండి ఆలయం వద్ద కూడా బోటు పాయింట్ ఉంది, అక్కడి నుంచి పర్యాటకులు పాపికొండల విహార యాత్రకు బయలుదేరతారు.

    రాజమండ్రి నుంచి కూడా వాహనాలలో పురుషోత్తపట్నం మీదుగా పోశమ్మగండికి చేరుకోవచ్చు.

    పెద్దల టికెట్ ధర రూ. 950, పిల్లలకు రూ. 750గా నిర్ణయించారు. లాంచీ పోచవరం నుంచి బయలుదేరి, పాపికొండల్లోని కొర్టూరు వరకు వెళ్లి తిరిగి వస్తుంది.

    వివరాలు 

    తెలంగాణ టూరిజం వెబ్‌సైట్ ద్వారా టికెట్లు 

    మార్గమధ్యలో పేరంటాలపల్లి ఆశ్రమాన్ని కూడా చూపిస్తారు. ప్రయాణ సమయంలో టీ, టిఫిన్, భోజనం లాంచీ నిర్వాహకుల ద్వారా అందించబడుతుంది.

    పాపికొండల యాత్రకు వెళ్లే వారు తెలంగాణ టూరిజం వెబ్‌సైట్ ద్వారా టికెట్లను పొందవచ్చు.

    భద్రాచలం నుంచి ప్రయాణం చేసే పర్యాటకులు అదనంగా ట్రాన్స్‌పోర్ట్ చార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భద్రాచలం

    తాజా

    Vande Bharat: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్‌! వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    Miss World 2025: నేటి నుంచి మిస్‌ వరల్డ్‌ కాంటినెంటల్‌ ఫినాలే తెలంగాణ
    Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లపై కీలక సమాచారం.. నేరుగా లబ్దిదారుల ఆకౌంట్లలోకి నిధులు తెలంగాణ
    Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు  స్టాక్ మార్కెట్

    భద్రాచలం

    తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద ఉద్ధృత ప్రవాహం, పోలవరానికి పెరుగుతున్న నీటిమట్టం గోదావరి నదీ
    భద్రాద్రి కొత్తగూడెంలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు  భూకంపం
    Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ భారతదేశం
    Bhadrachalam: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025