Loading...
Synthesia CEO Victor Riparbelli: 100 మంది వద్దన్నారు.. ఇప్పుడు రూ.38 వేల కోట్ల ఏఐ కంపెనీ!
100 మంది వద్దన్నారు.. ఇప్పుడు రూ.38 వేల కోట్ల ఏఐ కంపెనీ!

Synthesia CEO Victor Riparbelli: 100 మంది వద్దన్నారు.. ఇప్పుడు రూ.38 వేల కోట్ల ఏఐ కంపెనీ!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2026
02:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధ (ఏఐ)ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న ఈ రోజుల్లో, చాట్‌జీపీటీ వంటి సాధనాలు అందుబాటులోకి రావడానికి ముందే ఒక వినూత్న ఆలోచనతో ప్రారంభమైన స్టార్టప్ ఇప్పుడు వేల కోట్ల విలువైన సంస్థగా ఎదిగింది. ప్రారంభ దశలో 100మందికి పైగా ఇన్వెస్టర్లు పెట్టుబడులకు నిరాకరించినా,వ్యవస్థాపకుడి పట్టుదల, సరైన వ్యూహం ఆ సంస్థను 4 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.38వేల కోట్లు) విలువైన కంపెనీగా నిలబెట్టాయి. లండన్‌కు చెందిన ఏఐ వీడియో ప్లాట్‌ఫామ్ సింథీషియా విజయగాథ ప్రస్తుతం స్టార్టప్ ప్రపంచంలో ఆదర్శంగా నిలుస్తోంది. సింథీషియా సంస్థను 2017లో సహ వ్యవస్థాపకుడు,సీఈఓ విక్టర్ రిపార్‌బెల్లీ ప్రారంభించారు. వినియోగదారు టెక్స్ట్ రూపంలో ఇచ్చిన సమాచారాన్ని ఏఐ అవతార్ల సహాయంతో ప్రొఫెషనల్ వీడియోగా మార్చే సాంకేతికతను సంస్థ అభివృద్ధి చేసింది.

వివరాలు 

విక్టర్ రిపార్‌బెల్లీ కీలకమైన వ్యూహాత్మక నిర్ణయం

ఈ టెక్నాలజీతో కెమెరాలు, నటీనటులు, చిత్రీకరణ బృందం అవసరం లేకుండానే నాణ్యమైన వీడియోలను సులభంగా రూపొందించే అవకాశం కలిగింది.

అయితే, ఏఐతో నిజమైనట్లుగా కనిపించే వీడియోలను తయారు చేయడం వ్యాపారపరంగా విజయవంతం కాదని అప్పటి చాలామంది ఇన్వెస్టర్లు భావించారు.

దీంతో సింథీషియాలో పెట్టుబడులు పెట్టేందుకు వారు ముందుకు రాలేదు. వరుసగా ఎదురైన తిరస్కరణలు సంస్థ ప్రయాణానికి పెద్ద సవాలుగా మారాయి.

ఈ పరిస్థితుల్లో విక్టర్ రిపార్‌బెల్లీ కీలకమైన వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు.

వినోద రంగాన్ని లక్ష్యంగా చేసుకోవడం బదులుగా, ఉద్యోగుల శిక్షణ, ఆన్‌బోర్డింగ్ ప్రక్రియలు, సంస్థల అంతర్గత కమ్యూనికేషన్ అవసరాల కోసం ఏఐ వీడియోల వినియోగంపై సంస్థ దృష్టి కేంద్రీకరించింది.

ఈ మార్పే సింథీషియా అభివృద్ధికి బలమైన పునాది అయింది.

వివరాలు 

యూరప్‌లోని ప్రముఖ ఏఐ సంస్థల్లో ఒకటిగా సింథీషియా

తిరస్కరణలు ఎదురైనా తన ఆలోచనపై నమ్మకం కోల్పోని రిపార్‌బెల్లీ,ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ క్యూబన్‌కు కోల్డ్ ఈమెయిల్ పంపారు.

అదే కంపెనీకి తొలి దశలో నిధులు సమకూరడానికి దోహదపడింది.

అనంతరం మరిన్ని పెట్టుబడులను ఆకర్షించిన సింథీషియా, యూరప్‌లోని ప్రముఖ ఏఐ సంస్థల్లో ఒకటిగా ఎదిగింది.

ఇటీవల నిర్వహించిన ఫండింగ్ రౌండ్లలో తొలి దశ ఉద్యోగులు, ప్రారంభ ఇన్వెస్టర్లు తమ వాటాలను విక్రయించి లాభాలు పొందే అవకాశాన్ని కూడా కంపెనీ కల్పించింది.

ADVERTISEMENT

వివరాలు 

సీఈఓ విక్టర్ రిపార్‌బెల్లీ పట్టుదలకు నిదర్శనంగా నిలిచిన విజయం

కొత్త సాంకేతిక ఆలోచనలు మొదట్లో అసాధ్యంగా కనిపించడం సహజమేనని విక్టర్ రిపార్‌బెల్లీ చెబుతున్నారు.

ఫండింగ్ కోసం ప్రయత్నించే వ్యవస్థాపకులు ఓర్పు, పట్టుదలతో ముందుకు సాగితేనే విజయాన్ని అందుకోగలరని ఆయన అనుభవం స్పష్టం చేస్తోంది.

ఒకప్పుడు అనుమానాలు ఎదుర్కొన్న ఆలోచనే, సరైన వ్యూహం, దృఢ సంకల్పంతో నేడు 4 బిలియన్ డాలర్ల విలువైన సంస్థగా ఎదిగి స్టార్టప్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచింది.

ADVERTISEMENT