LOADING...
Land of rivers: మన దేశంలో 'డైమండ్ నది' ఏది? అసలు నిజం ఇదే!
మన దేశంలో 'డైమండ్ నది' ఏది? అసలు నిజం ఇదే!

Land of rivers: మన దేశంలో 'డైమండ్ నది' ఏది? అసలు నిజం ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 17, 2026
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం నిజంగా 'నదుల భూమి'గా పేరొందింది. దేశవ్యాప్తంగా 12 ప్రధాన నదీ వ్యవస్థలు, 400కిపైగా నదులు ప్రవహిస్తూ భారత భూభాగాన్ని సుసంపన్నం చేస్తున్నాయి. నదులు కేవలం భౌగోళిక లక్షణాలు మాత్రమే కాకుండా, కోట్లాది ప్రజల జీవనాధారంగా నిలుస్తున్నాయి. సాగునీరు, తాగునీరు, జలవిద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమల అవసరాలు—ఇలా అనేక రంగాల్లో నదుల పాత్ర అపారంగా ఉంది. భారత నదుల్లో ఒక నది చరిత్రపరంగా విశేష గుర్తింపు పొందింది. ఆ నదిని ప్రపంచవ్యాప్తంగా 'డైమండ్ నది'గా పిలుస్తారు.

Details

వజ్రాలు విస్తారంగా లభించడం వల్లే ఆ పేరు

వజ్రాలు విస్తారంగా లభించడం వల్లే ఆ పేరు వచ్చింది. భారతదేశంలో కృష్ణా రివర్‌నే డైమండ్ నదిగా గుర్తిస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహీనూర్ వంటి వజ్రాలు కృష్ణా నది పరివాహక ప్రాంతంలోనే లభించాయి. కృష్ణా నది మహారాష్ట్రలోని మహబలేశ్వరం వద్ద ఉద్భవిస్తుంది. తుంగభద్ర సహా అనేక ఉపనదులు కృష్ణా ప్రవాహాన్ని మరింత బలోపే'తం చేస్తాయి. అలాగే నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాం వంటి ప్రముఖ ప్రాజెక్టుల ద్వారా కృష్ణా నది దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.

Advertisement