Page Loader
ISRO: భారత అంతరిక్ష ప్రయోగాల్లో నూతన మైలురాయిగా వందో రాకెట్ 
భారత అంతరిక్ష ప్రయోగాల్లో నూతన మైలురాయిగా వందో రాకెట్

ISRO: భారత అంతరిక్ష ప్రయోగాల్లో నూతన మైలురాయిగా వందో రాకెట్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 28, 2025
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల వరకు విదేశీ అంతరిక్ష సంస్థలతో పోటీ పడిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పుడు స్వయంగా తనతోనే పోటీ పడుతూ వేగంగా ముందుకు సాగుతోంది. స్వదేశీ పరిజ్ఞానాన్ని నిరంతరం అభివృద్ధి చేసుకుంటూ అత్యుత్తమ అంతరిక్ష సంస్థగా ఎదగడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. తక్కువ వ్యయంతో అత్యుత్తమ ఫలితాలు సాధించే సంస్థగా పేరు సంపాదించుకుంది. ఈ క్రమంలో బుధవారం తన వందో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌15 రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.

Details

ఇప్పటికే 80శాతం పనులు పూర్తి

ప్రారంభ దశల్లో ఏడాదికి ఒక్క రాకెట్ ప్రయోగం నిర్వహించడమే ఇస్రోకు ఒక పెద్ద సవాలుగా ఉండేది. అయితే తరువాతి కాలంలో ప్రతి సంవత్సరం నాలుగు నుంచి పది రాకెట్ ప్రయోగాలు నిర్వహించే స్థాయికి చేరుకుంది. రాబోయే కాలంలో ఈ సంఖ్యను 15కు పెంచే లక్ష్యంతో షార్ (శ్రీహరికోట) కేంద్రంలో మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతోంది. ఇప్పటికే ఈ పనుల్లో 80 శాతం పూర్తయింది.