NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మరో పదేళ్ళలో మానవాళికి తీవ్ర నష్టం: తేల్చేసిన 42శాతం సీఈవోలు 
    తదుపరి వార్తా కథనం
    ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మరో పదేళ్ళలో మానవాళికి తీవ్ర నష్టం: తేల్చేసిన 42శాతం సీఈవోలు 
    ఏఐ వల్ల మానవాళికి ప్రమాదం అంటున్న సీఈవోలు

    ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మరో పదేళ్ళలో మానవాళికి తీవ్ర నష్టం: తేల్చేసిన 42శాతం సీఈవోలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jun 16, 2023
    05:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఛాట్ జీపీటీ వాడుకలోకి వచ్చిన తర్వాత ఆర్టీఫీషిఅయ్ల్ ఇంటెలిజెన్స్ గురించి రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఏఐ కారణంగా మానవాళికి తీవ్ర నష్టం జరుగుతుందని చాలామంది వ్యాపారవేత్తలు చెబుతున్నారు.

    తాజాగా, యేల్ సీఈవో సమావేశంలో కూడా 42శాతం మంది సీఈవోలు ఇదే మాట చెప్పారు. ఈ సమ్మిట్ లో మొత్తం 119కంపెనీలకు చెందిన సీఈవోలు పాల్గొన్నారు.

    వచ్చే పదేళ్ళలో ఏఐ వల్ల మానవాళి అతిపెద్ద విధ్వంసాన్ని ఎదుర్కోబోతుందని ఈ సీవోలు చెప్పుకొచ్చారు.

    ఎలాన్ మస్క్, బిల్ గేట్స్ వంటి దిగ్గజాలు ఏఐ వల్ల అనుకోని పరిణామాలు ఎదురవుతాయని చెబుతున్నారు.

    ఏఐ కారణంగా ఆరోగ్య, రవాణా, ఆర్థిక, వినోదం వంటి రంగాల్లో అనేక మార్పులు రాబోతున్నాయని, ఆ మార్పులు అనేక దుష్పరిణామాలకు దారి తీస్తాయని అంటున్నారు.

    Details

    ఏమీ కాదంటున్న 58శాతం సీఈవోలు 

    ఆరోగ్య రంగంలో చావులు ఎక్కువయ్యే అవకాశం ఉందనీ, వాటికవే నడిచే కార్ల వల్ల యాక్సిడెంట్లు ఎక్కువవుతాయని, సైబర్ అటాక్స్ పెరుగుతాయని అంటున్నారు.

    అయితే మిగతా 58శాతం కంపెనీల సీఈవోలు మాత్రం ఏఐ వల్ల అలాంటి సంఘటనలు ఏవీ జరగవనీ, మానవాళి మనుగడకు నష్టం జరగబోదని అన్నారు.

    ఛాట్ జీపీ సృష్టికర్త, ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్ మన్ ప్రకారం, ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అనేక ఉద్యోగాలు పోతాయని అంటున్నాడు. అలాగే ఏఐ వ్యవస్థపై నియంత్రణ ఉండాలని సామ్ ఆల్టన్ కోరుతున్నాడు.

    ఏఐ ని నియంత్రించకపోతే నెగెటివ్ కోసం ఉపయోగించే వారు పెరుగుతారని, దానివల్ల సమస్యలు ఉద్భవిస్తాయని సామ్ ఆల్టన్ చెప్పుకొచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెక్నాలజీ

    తాజా

    Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. సీఎం సిద్ధరామయ్య పొలిటికల్‌ సెక్రటరీపై వేటు బెంగళూరు
    Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. నిఫ్టీ @25,000  స్టాక్ మార్కెట్
    Modi in J&K: 'కశ్మీర్‌లో పర్యాటకాన్ని దెబ్బతీయాలని పాక్‌ కుట్రలు' : నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ
    Piyush Chawla : 36 ఏళ్ల వ‌య‌సులో.. రిటైర్‌మెంట్ ప్రకటించిన భార‌త క్రికెట‌ర్‌  క్రికెట్

    టెక్నాలజీ

    వైరల్‌గా మారిన మార్క్ జుకర్‌బర్గ్ ర్యాంప్ వాక్ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    ఏప్రిల్ 2న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    ఏప్రిల్ 3న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన నోకియా C12 ప్లస్ స్మార్ట్ ఫోన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025