ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మరో పదేళ్ళలో మానవాళికి తీవ్ర నష్టం: తేల్చేసిన 42శాతం సీఈవోలు
ఛాట్ జీపీటీ వాడుకలోకి వచ్చిన తర్వాత ఆర్టీఫీషిఅయ్ల్ ఇంటెలిజెన్స్ గురించి రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఏఐ కారణంగా మానవాళికి తీవ్ర నష్టం జరుగుతుందని చాలామంది వ్యాపారవేత్తలు చెబుతున్నారు. తాజాగా, యేల్ సీఈవో సమావేశంలో కూడా 42శాతం మంది సీఈవోలు ఇదే మాట చెప్పారు. ఈ సమ్మిట్ లో మొత్తం 119కంపెనీలకు చెందిన సీఈవోలు పాల్గొన్నారు. వచ్చే పదేళ్ళలో ఏఐ వల్ల మానవాళి అతిపెద్ద విధ్వంసాన్ని ఎదుర్కోబోతుందని ఈ సీవోలు చెప్పుకొచ్చారు. ఎలాన్ మస్క్, బిల్ గేట్స్ వంటి దిగ్గజాలు ఏఐ వల్ల అనుకోని పరిణామాలు ఎదురవుతాయని చెబుతున్నారు. ఏఐ కారణంగా ఆరోగ్య, రవాణా, ఆర్థిక, వినోదం వంటి రంగాల్లో అనేక మార్పులు రాబోతున్నాయని, ఆ మార్పులు అనేక దుష్పరిణామాలకు దారి తీస్తాయని అంటున్నారు.
ఏమీ కాదంటున్న 58శాతం సీఈవోలు
ఆరోగ్య రంగంలో చావులు ఎక్కువయ్యే అవకాశం ఉందనీ, వాటికవే నడిచే కార్ల వల్ల యాక్సిడెంట్లు ఎక్కువవుతాయని, సైబర్ అటాక్స్ పెరుగుతాయని అంటున్నారు. అయితే మిగతా 58శాతం కంపెనీల సీఈవోలు మాత్రం ఏఐ వల్ల అలాంటి సంఘటనలు ఏవీ జరగవనీ, మానవాళి మనుగడకు నష్టం జరగబోదని అన్నారు. ఛాట్ జీపీ సృష్టికర్త, ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్ మన్ ప్రకారం, ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అనేక ఉద్యోగాలు పోతాయని అంటున్నాడు. అలాగే ఏఐ వ్యవస్థపై నియంత్రణ ఉండాలని సామ్ ఆల్టన్ కోరుతున్నాడు. ఏఐ ని నియంత్రించకపోతే నెగెటివ్ కోసం ఉపయోగించే వారు పెరుగుతారని, దానివల్ల సమస్యలు ఉద్భవిస్తాయని సామ్ ఆల్టన్ చెప్పుకొచ్చారు.