LOADING...
ISRO chief: 2040లో చందమామపై అడుగుపెట్టనున్న భారతీయ వ్యోమగామి : ఇస్రో చీఫ్‌ 
2040లో చందమామపై అడుగుపెట్టనున్న భారతీయ వ్యోమగామి : ఇస్రో చీఫ్

ISRO chief: 2040లో చందమామపై అడుగుపెట్టనున్న భారతీయ వ్యోమగామి : ఇస్రో చీఫ్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2025
05:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతరిక్ష రంగాన్ని అభివృద్ధి కోసం ప్రస్తుతం ఇస్రో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్లు ఇస్రో చీఫ్‌ వి. నారాయణ్‌ వెల్లడించారు. వాటిలో ప్రధానంగా 80,000 కిలోల బరువును రవాణా చేయగల రాకెట్లను తయారు చేయడం, 2026లో "వ్యోమమిత్ర" అనే రోబోను అంతరిక్షంలో పంపడం, 2035 నాటికి జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, చంద్రుడిపై అధ్యయనం కోసం "వీనస్ ఆర్బిటర్ మిషన్ (VOM)"ను ప్రారంభించడం వంటి లక్ష్యాలు ఉన్నాయి. అంతరిక్ష మిషన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్, బిగ్ డేటా వంటి ఆధునిక సాంకేతికతలను వినియోగించడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

వివరాలు 

2027లో ప్రతిష్ఠాత్మక "చంద్రయాన్-4" ప్రయోగం 

అభివృద్ధి చెందిన భారత్‌ ప్రతినిధిగా 2040లో భారతీయ వ్యోమగామి చంద్రుని ఉపరితలంలో అడుగుపెట్టనుందని నారాయణ్ పేర్కొన్నారు. 2027లో చేపట్టబోయే మానవ సహిత గగనయాత్ర కూడా ప్రణాళికలో భాగమని ఆయన వెల్లడించారు. 2040 నాటికి తొలి మానవ సహిత చంద్ర మిషన్‌ను ప్రధాని సూచనల ప్రకారం చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇలాంటి మిషన్లు 2047 నాటికి భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అంతరిక్ష రంగంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, గగన్‌యాన్‌ కార్యక్రమంలోని మరిన్ని ప్రయోగాలకు సిద్ధంగా ఉన్నామని నారాయణ్ తెలిపారు. చంద్రుడి ఉపరితల నమూనాలను భూమికి తీసుకురావడానికి 2027లో ప్రతిష్ఠాత్మక "చంద్రయాన్-4" ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు వివరించారు.

వివరాలు 

అంతరిక్ష ఆధారిత డేటా విశ్లేషణలపై అధ్యయం కోసం 300 కంటే ఎక్కువ స్టార్టప్‌లు..

ఇస్రో చీఫ్‌ ప్రకారం, కొన్ని సంవత్సరాల క్రితం అంతరిక్ష రంగంలో రెండు-మూడు స్టార్టప్‌లు మాత్రమే ఉన్నప్పటికీ, ఇప్పటికి ఉపగ్రహ నిర్మాణం, ప్రయోగ సేవలు, అంతరిక్ష ఆధారిత డేటా విశ్లేషణలలో 300 కంటే ఎక్కువ స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. ఇవి వ్యవసాయం, విపత్తు ప్రతిస్పందన, నిర్వహణ, టెలికమ్యూనికేషన్, రియల్-టైమ్ రైలు, వాహన పర్యవేక్షణ వంటి విభాగాలలో ఉపగ్రహ ఆధారిత అనువర్తనాల అభివృద్ధికి ఉపయోగపడతాయని చెప్పారు.