Google: ఏఐతో రూపొందించిన తొలి జీరో-డే సైబర్ దాడిని అడ్డుకున్న గూగుల్
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ తాజాగా కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో రూపొందించిన తొలి జీరో-డే సైబర్ దాడిని అడ్డుకుంది. ఓ ఓపెన్ సోర్స్ వెబ్ ఆధారిత సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ టూల్ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు గూగుల్ తెలిపింది. ఈ ఎక్స్ప్లాయిట్ ద్వారా హ్యాకర్లు టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ (2FA) భద్రతను కూడా దాటేసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. గూగుల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ (GTIG) ఈ ముప్పును గుర్తించింది. పైథాన్ స్క్రిప్ట్లో గుర్తించిన కోడ్లో ఏఐ వాడిన ఆనవాళ్లు కనిపించాయని తెలిపింది.
వివరాలు
సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులు ఉపయోగిస్తున్నట్లు GTIG నివేదిక
తప్పుడు CVSS స్కోర్లు, పుస్తకాల మాదిరి స్ట్రక్చర్ ఉన్న ఫార్మాటింగ్ ద్వారా ఇది ఏఐ సాయంతో తయారైనట్లు అనుమానిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఈ దాడికి తమ జెమినీ ఏఐ ఉపయోగించలేదని గూగుల్ స్పష్టం చేసింది. మరోవైపు హ్యాకర్లు ఇప్పుడు ఏఐతో భద్రతా లోపాలను గుర్తించి దాడులు మరింత వేగంగా చేస్తున్నారని హెచ్చరించింది. ఏఐ టూల్స్, థర్డ్పార్టీ డేటా కనెక్టర్లను కూడా లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులు ఉపయోగిస్తున్నట్లు GTIG నివేదిక వెల్లడించింది.