NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Digital Payments : ఆరేళ్లలో డిజిటల్ పేమెంట్స్ రెట్టింపు..కెర్నీ అండ్ అమెజాన్ సంయుక్త సర్వే
    తదుపరి వార్తా కథనం
    Digital Payments : ఆరేళ్లలో డిజిటల్ పేమెంట్స్ రెట్టింపు..కెర్నీ అండ్ అమెజాన్ సంయుక్త సర్వే
    Digital Payments : ఆరేళ్లలో డిజిటల్ పేమెంట్స్ రెట్టింపు..కెర్నీ అండ్ అమెజాన్ సంయుక్త సర్వే

    Digital Payments : ఆరేళ్లలో డిజిటల్ పేమెంట్స్ రెట్టింపు..కెర్నీ అండ్ అమెజాన్ సంయుక్త సర్వే

    వ్రాసిన వారు Stalin
    Jul 15, 2024
    01:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రోజురోజుకు డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నాయి.

    పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 నాటికి భారత్‌లో డిజిటల్ చెల్లింపులు 7 లక్షల కోట్ల డాలర్లకు చేరనున్నాయని కెర్నీ అండ్ అమెజాన్ సంయుక్త సర్వేలో తేలింది.

    'హౌ అర్బన్ ఇండియా పేస్' అనే పేరుతో కెర్నీ, అమెజాన్ పే సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఆఫ్‌లైన్ చెల్లింపులు గణనీయంగానే ఉన్నా, ఆన్‌లైన్ కొనుగోళ్లకు డిజిటల్ చెల్లింపులే ఎక్కువగా జరుగుతున్నాయని, పేమెంట్స్ విషయమై కస్టమర్ల ధోరణి శాశ్వతంగా షిఫ్ట్ అవుతున్నదని ఈ అధ్యయనం సారాంశం

    వివరాలు 

    90 శాతం మంది ఆన్ లైన్ కొనుగోళ్లకు డిజిటల్ చెల్లింపులే

    సర్వేలో పాల్గొన్న వారిలో 90 శాతం మంది ఆన్ లైన్ కొనుగోళ్లకు డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. సంపన్నులే ఎక్కువగా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారని తెలిపారు.

    వారు వివిధ రూపాల్లో డిజిటల్ పేమెంట్స్ 80 శాతం చేస్తారని ఈ అధ్యయనం సారాంశం.

    దేశంలోని 120 నగరాల పరిధిలో 1000 మంది వ్యాపారులతోపాటు ఆరు వేల మందిని సర్వే చేశామని కెర్నీ, అమెజాన్ పే తెలిపాయి.

    చిన్న పట్టణాల పరిధిలో డిజిటల్ జోరు చిన్న పట్టణాల పరిధిలో 65 శాతం డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి.

    ప్రధాన పట్టణాల్లో 75 శాతం డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని కెర్నీ-అమెజాన్ పే సంయుక్త సర్వే పేర్కొంది.

    వివరాలు 

    ఏటా గణనీయంగా డిజిటల్ చెల్లింపుల పెరుగుదల 

    2017-18 ఆర్థిక సంవత్సరంలో 300 బిలియన్ డాలర్ల విలువైన పేమెంట్స్ జరిగితే, 2023-24 నాటికి 3.6 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఏడు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని ఆ నివేదిక సారాంశం.

    కార్డులు, డిజిటల్ వాలెట్లతో డిజిటల్ చెల్లింపుల్లో పాపులారిటీ పెరిగిందని, మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో వీటి వాటా 10 శాతం ఉంటుందని ఈ నివేదిక తెలిపింది.

    25- 43 మధ్య వున్న వారీతో సహా 44-60 వయసు వున్న వారు అన్ని రకాల డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నారు.

    స్త్రీ పురుషులు 72 శాతం డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నారని పేర్కొంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమెజాన్‌

    తాజా

    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్

    అమెజాన్‌

    భారతదేశంలో డెలివరీలు త్వరగా అందించడానికి ఎయిర్ కార్గో ఫ్లీట్ ప్రారంభించనున్న అమెజాన్ భారతదేశం
    అమెజాన్ లో రూ. 77,000 తగ్గింపుతో అందుబాటులో ఉన్న ASUS ROG Zephyrus M16 ల్యాప్ టాప్
    భారతదేశంలో AMD సపోర్టెడ్ Aspire 3 ల్యాప్‌టాప్‌ను విడుదల చేసిన Acer ల్యాప్ టాప్
    మార్కెట్లో విడుదలైన లావా Blaze 5G కొత్త వేరియంట్‌ ఆండ్రాయిడ్ ఫోన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025