iPhone Duo display: ఐఫోన్ డ్యూయో డిస్ప్లే ధర $250.. శాంసంగ్తో యాపిల్ డీల్!
ఈ వార్తాకథనం ఏంటి
ఫోల్డబుల్ ఐఫోన్ విషయంలో యాపిల్ కీలక అడుగు వేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ లీకర్ 'Instant Digital' వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫోల్డబుల్ ఐఫోన్ల కోసం Samsung Displayతో యాపిల్ మూడేళ్ల ప్రత్యేక ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. భవిష్యత్లో విడుదల కానున్న ఫోల్డబుల్ ఐఫోన్లకు, ఇందులో రానున్న iPhone Duoకు అవసరమైన ఫోల్డబుల్ డిస్ప్లే ప్యానెళ్లను శాంసంగ్ సరఫరా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం ఒక్క ఫోల్డబుల్ డిస్ప్లే ప్యానెల్ ధర సుమారు '$250' ఉండనున్నట్లు సమాచారం. దీంతో iPhone Duoలో అత్యంత ఖరీదైన ప్రధాన భాగాల్లో ఈ డిస్ప్లే ప్యానెల్ కూడా ఒకటిగా నిలవనుంది.
వివరాలు
35 శాతం రీసైకిల్డ్ మెటీరియల్తో iPhone Duo
iPhone Duo తయారీలో పర్యావరణ అనుకూల విధానాలకు యాపిల్ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ డివైజ్లో ఉపయోగించే మొత్తం మెటీరియల్లో 35 శాతం రీసైకిల్డ్ కంటెంట్ ఉండనుంది. ఇందులో భాగంగా బ్యాటరీలో 100 శాతం రీసైకిల్డ్ కోబాల్ట్ ను ఉపయోగించనున్నారు.
అలాగే 3D ప్రింట్ చేసిన హింజ్ కవర్లో 100 శాతం రీసైకిల్డ్ టైటానియం ను వినియోగించనున్నట్లు సమాచారం.
వివరాలు
తయారీలో 60 శాతం పునరుత్పాదక ఇంధనం
iPhone Duo తయారీ ప్రక్రియలోనూ పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించే చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
సప్లై చైన్ అంతటా ఈ డివైజ్ను తయారు చేసేందుకు ఉపయోగించే శక్తిలో 60 శాతం పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే అందుకోనున్నట్లు సమాచారం.
వీటిలో ప్రధానంగా గాలి, సౌర విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వనరులున్నాయి.
అలాగే శక్తి సామర్థ్యం, సురక్షితమైన కెమిస్ట్రీకి సంబంధించిన ఉన్నత ప్రమాణాలను పాటిస్తున్నట్లు యాపిల్ తెలిపింది.
వివరాలు
2030 నాటికి కార్బన్ న్యూట్రల్ లక్ష్యం
యాపిల్ తన మొత్తం కార్యకలాపాల పరిధిలో 2030 నాటికి కార్బన్ న్యూట్రల్ గా మారాలనే లక్ష్యాన్ని మరోసారి స్పష్టం చేసింది.
iPhone Duoకు సంబంధించిన వివరాల్లోనూ ఈ లక్ష్యాలపై కంపెనీ దృష్టి కనిపిస్తోంది.
ఉత్పత్తి ప్రక్రియలో రీసైకిల్డ్ మెటీరియల్స్ను వినియోగించడం, పునరుత్పాదక ఇంధన వనరులపై ఆధారపడటం ద్వారా పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడంపై యాపిల్ దృష్టి సారించింది.