ISRO: అంతరిక్ష ప్రయోగాల్లో మరో ముందడుగు.. గగనయాన్ కోసం కీలక పరీక్ష పూర్తి చేసిన ఇస్రో
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగనయాన్ మిషన్ సన్నాహాల్లో భాగంగా మరో కీలక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఐఎస్ఆర్ఓ శాస్త్రవేత్తలను అభినందించారు. రెండో సమగ్ర ఎయిర్ డ్రాప్ పరీక్ష (ఐఏడీటీ-02) ద్వారా గగనయాన్ మిషన్ సిద్ధతలో మరో ముందడుగు పడిందని తెలిపారు. ఈ పరీక్షలో సుమారు ఐదు టన్నుల బరువున్న క్రూ మాడ్యూల్ నమూనాను ఎత్తు నుంచి వదిలి, భూమిపై సురక్షితంగా దిగే సమయంలో ఉపయోగించే పరాచూట్ వ్యవస్థ పనితీరును పరిశీలించారు.
వివరాలు
భూమికి సురక్షితంగా తీసుకురావడమే లక్ష్యం
2025 ఆగస్టు 24న మొదటి పరీక్షను భారత వాయుసేనకు చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా 3.1 కి.మీ ఎత్తు నుంచి నిర్వహించారు. ఆ సమయంలో ఇస్రోతో పాటు వాయుసేన, డీఆర్డీఓ, నౌకాదళం, తీరరక్షక దళం కలిసి పనిచేశాయి. ఈ పరీక్ష బంగాళాఖాతంపై జరగగా, మొత్తం ప్రక్రియ గంటసేపు సాగింది. గగనయాన్ మిషన్ ద్వారా ముగ్గురు వ్యోమగాములను 400 కి.మీ కక్ష్యలో మూడు రోజుల పాటు పంపించి తిరిగి భూమికి సురక్షితంగా తీసుకురావడమే లక్ష్యం. అయితే కీలక సాంకేతిక పరీక్షల్లో ఆలస్యం కారణంగా ఈ మిషన్ సమయపట్టిక మరింత వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ISROకు కేంద్ర మంత్రి అభినందనలు
Congratulations #ISRO for the successful accomplishment of Second Integrated Air Drop Test (IADT-02) for #Gaganyaan, India’s first Human Space flight scheduled next year.
— Dr Jitendra Singh (@DrJitendraSingh) April 10, 2026
The second Integrated Air Drop Test (IADT-02) was successfully conducted at Satish Dhawan Space Station…