AI : రోబోలా క్షణాల్లో స్టోరీ తెలుసుకోండి.. ఎక్స్లో కొత్త ఏఐ ఫీచర్!
ఈ వార్తాకథనం ఏంటి
ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని X (గతంలో ట్విట్టర్) ప్లాట్ఫారమ్ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. 'AI-పవర్డ్ ఆర్టికల్ సమ్మరీస్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ ద్వారా, పెద్ద కథనాలను పూర్తిగా చదవకుండానే వాటి ముఖ్యాంశాలను బుల్లెట్ పాయింట్ల రూపంలో తక్షణమే తెలుసుకోవచ్చు. యూజర్ ఒక ఆర్టికల్ను ఓపెన్ చేసి 'సమ్మరైజ్' బటన్ను నొక్కగానే, ఏఐ వెంటనే ఆ కంటెంట్ను సంక్షిప్తంగా అందిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ కంటెంట్ను వేగంగా చదవాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్తో పాటు, వాయిస్ ఆధారిత 'లిజన్' అనే మరో ఆప్షన్ను కూడా జోడించారు. ఇది గ్రోక్ ఏఐ టెక్నాలజీతో పనిచేస్తూ, యూజర్లు ఇతర పనులు చేస్తూనే ఆర్టికల్ను వినే సౌకర్యాన్ని కల్పిస్తుంది.
Details
ఈ ఫీచర్ సమయాన్ని ఆదా చేస్తుంది
కొంతమంది వినియోగదారులు ఈ ఫీచర్ సమయాన్ని ఆదా చేస్తుందని, కంటెంట్ను సులభంగా అర్థం చేసుకునేలా చేస్తుందని ప్రశంసిస్తున్నారు. అయితే మరికొందరు పూర్తి కథనం చదవాలనే ఆసక్తి తగ్గిపోవచ్చని, ముఖ్యమైన విషయాలు ముందుగానే తెలిసిపోవడం వల్ల చదివే అనుభవం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్లు ప్రీమియం, ప్రీమియం ప్లస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భారతదేశంలో ప్రీమియం ప్లాన్ ధర నెలకు సుమారు రూ.427 కాగా, ప్రీమియం ప్లస్ ప్లాన్ రూ.2,570గా ఉంది. పరిమిత కాలానికి డిస్కౌంట్ ఆఫర్ కూడా అందిస్తున్నారు. ఇటీవల నెలల్లో ఆర్టికల్ ఎంగేజ్మెంట్ పెరుగుతున్న నేపథ్యంలో ఏఐ ఆధారిత ఫీచర్ల ద్వారా యూజర్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడంపై ఎక్స్ ప్లాట్ఫారమ్ దృష్టి సారించింది.