LOADING...
Matsya-6000: సముద్రతలంలో 6,000 మీటర్ల లోతుకు ప్రయాణించే 'మత్స్య-6000'.. భారత్‌ ప్రగతిలో మరో ముందడుగు
సముద్రతలంలో 6,000 మీటర్ల లోతుకు ప్రయాణించే 'మత్స్య-6000'.. భారత్‌ ప్రగతిలో మరో ముందడుగు

Matsya-6000: సముద్రతలంలో 6,000 మీటర్ల లోతుకు ప్రయాణించే 'మత్స్య-6000'.. భారత్‌ ప్రగతిలో మరో ముందడుగు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2024
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం అంతరిక్ష అన్వేషణల్లోనూ, ఇప్పుడు సముద్రాన్వేషణల్లోనూ సత్తా చాటుతోంది. ఈ క్రమంలో 'సముద్రయాన్‌' ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా సముద్రంలోని 6,000 మీటర్ల లోతుకు వెళ్లి, 12 గంటల సమయం గడిపి తిరిగి రాగలిగే ప్రత్యేక 'మత్స్య-6000' అనే డైవింగ్‌ మెషీన్‌ను సిద్దం చేసింది. ఈ ప్రత్యేక ఉపకరణం సిబ్బంది భద్రత, అత్యవసర పరిస్థితుల్లో తట్టుకొనేలా రూపొందించారు. దీనికి అవసరమైన ప్రత్యేక ఆహారాన్ని డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది. మత్స్య-6000 లో ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు మత్స్య-6000 అత్యవసర పరిస్థితుల్లో కూడా 96 గంటలపాటు సిబ్బంది ఉండేలా రూపొందించారు. ఇందుకోసం 67 ఆక్సిజన్‌ సిలిండర్లు సిద్ధంగా ఉంటాయి.

Details

108 గంటల పాటు పనిచేసే సామర్థ్యం

తద్వారా సబ్‌మెర్సిబుల్ 108 గంటలపాటు పనిచేయగలదు. 3 గంటల్లో సముద్రగర్భానికి వెళ్లి, మరో 3 గంటల్లో పైకి వచ్చి, 6 గంటలపాటు లోతైన సముద్రంలో పరిశోధన చేసే విధంగా డిజైన్‌ చేశారు. అధిక ఒత్తిడికి తట్టుకునే శక్తి 6,000 మీటర్ల లోతులో 'మత్స్య'పై ఒత్తిడి 596 రెట్లు ఉంటుంది. ఇది సుమారు 1,848 ఏనుగుల బరువుతో సమానం. ఈ గణాంకం అనుసరించి దాని నిర్మాణం కోసం టైటాన్‌ అలాయ్‌ వాడారు. ఇది దాదాపు 600 రెట్ల నీటి ఒత్తిడిని తట్టుకోగలదు. 'సాగర్‌నిధి' నౌక సాయంతో మత్స్య-6000 ప్రయాణం మత్స్య-6000 ప్రయాణం సాగర్‌నిధి అనే రీసెర్చ్ నౌక ద్వారా సాగుతుంది. ఈ నౌక సముద్ర జలాల్లో డీప్‌సీ మెషీన్‌కు పూర్వకాఠన శక్తిగా నిలుస్తుంది.

Details

 సముద్ర లోతుల పరిశోధనలు

ఈ యంత్రం సముద్రగర్భంలోని కెమోసింథటిక్‌ జీవాలు, మీథేన్‌ నిల్వలు, హైడ్రోథర్మల్‌ వెంట్స్‌ వంటి అంశాలపై అధ్యయనం చేయనుంది. భవిష్యత్తులో దీని ఉపయోగం సముద్ర పర్యటనల కోసం కూడా ఉండొచ్చు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, భారత్‌ సముద్రలోతుల పరిశోధన సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, జపాన్‌, ఫ్రాన్స్‌, చైనా వంటి దేశాల సరసన చేరుతుంది. ఆర్థిక వ్యయంతో భవిష్యత్తు అభివృద్ధి సముద్రయాన్‌ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం దాదాపు రూ.4,077 కోట్లు వెచ్చించింది. దీని విజయవంతం భారతదేశంలో డీప్‌సీ పరిశ్రమలకు పెరుగుదలకు సహకరించనుంది.

Advertisement