India 5G Users: 40 కోట్లకు పైగా 5జీ యూజర్లు.. ప్రపంచంలో టాప్-5 దేశాలివే
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ టెలికాం రంగం శక్తివంతంగా అభివృద్ధి చెందింది. 5జీ సేవలు ప్రారంభమైన తర్వాత కేవలం మూడు ఏళ్లకే ఈ సాంకేతికత కోట్లాది మంది వినియోగదారుల దైనందిన జీవితంలో భాగమైంది. ప్రభుత్వ గణాంకాలు, పరిశ్రమ నివేదికల ప్రకారం, 5జీ విస్తరణలో భారత్ కీలక మైలురాళ్లను తాకింది. కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలో 5జీ వినియోగదారుల సంఖ్య 40 కోట్లకు పైగా చేరింది. దీని ద్వారా భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద 5జీ వినియోగదారుల దేశంగా నిలిచింది. మొదటి స్థానంలో చైనా కొనసాగుతుంది, అక్కడ 100 కోట్లకు పైగా 5జీ వినియోగదారులున్నారు.
Details
భారత్ తర్వాత అమెరికా, యూరోప్, జపాన్
భారత్ తర్వాత అమెరికా, యూరోప్, జపాన్ ఉన్నాయి. గతంలో 2025 చివరికి 39.4 కోట్ల మంది వినియోగదారులు ఉంటారని అంచనా వేసినప్పటికీ, ఈ సంఖ్య ఆ అంచనాలను మించి ఉంది. భారతంలో 5జీకి బలమైన పునాది 2022 అక్టోబర్లో పడింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ 5జీ సేవలను అధికారికంగా ప్రారంభించారు. వేగవంతమైన ఇంటర్నెట్, డిజిటల్ ఇండియా లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడం ప్రధాన ఉద్దేశ్యం. ఆ సమయంలో రిలయెన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు 5జీ సేవలను ప్రజల్లోకి అందించాయి. టెలికాం కంపెనీలలో ముందుగా రిలయెన్స్ జియో తన జియో ట్రూ 5జీ సేవలను వాణిజ్యంగా ప్రారంభించింది.
Details
భారత్ లో డేటా చౌకగా లభిస్తోంది
వెంటనే భారతి ఎయిర్టెల్ 5జీ ప్లస్ సేవలను ప్రారంభించింది. వొడాఫోన్ ఐడియా 2024లో 5జీ రంగంలో అడుగుపెట్టినప్పటి నుంచి, 2025లో విస్తరణకు ప్రణాళికలు రూపొందించింది. ఈ క్రమంలో కొత్త టవర్లు, ఫైబర్ నెట్వర్క్, ఆధునిక సాంకేతిక వ్యవస్థలపై కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టాయి. భారతంలో 5జీ వేగంగా విస్తరించడానికి ప్రధాన కారణం అందుబాటు ధరలు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో మొబైల్ డేటా ఖర్చు చాలా తక్కువ. 5జీ సేవలకూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇటీవల కొంత ధరలు పెరిగినప్పటికీ, పెద్ద దేశాల్లో భారత్ డేటా చౌకగా లభించే దేశంగా మిగిలింది.