NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Glioblastoma: ప్రాణాంతక మెదడు క్యాన్సర్‌.. గంటలో నిర్దారించే కొత్త రక్త పరీక్ష 
    తదుపరి వార్తా కథనం
    Glioblastoma: ప్రాణాంతక మెదడు క్యాన్సర్‌.. గంటలో నిర్దారించే కొత్త రక్త పరీక్ష 
    ప్రాణాంతక మెదడు క్యాన్సర్‌.. గంటలో నిర్దారించే కొత్త రక్త పరీక్ష

    Glioblastoma: ప్రాణాంతక మెదడు క్యాన్సర్‌.. గంటలో నిర్దారించే కొత్త రక్త పరీక్ష 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 02, 2024
    04:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శాస్త్రవేత్తలు మెదడు క్యాన్సర్‌లోని అత్యంత ప్రమాదకరమైన రకం గ్లియోబ్లాస్టోమాను వేగంగా గుర్తించే కొత్త పద్ధతిని కనుగొన్నారు.

    కేవలం ఒక గంటలోనే ఈ పరికరం వ్యాధిని నిర్ధారించగలదని చెబుతున్నారు. రక్త పరీక్ష ద్వారా ఈ వ్యాధిని గుర్తించేందుకు నాట్రదామ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక ఆటోమేటెడ్‌ పరికరాన్ని అభివృద్ధి చేశారు.

    సాధారణంగా, క్యాన్సర్‌ కణాలను నిర్ధారించడానికి కణజాలాన్ని సేకరించి పరీక్షించాల్సి వస్తుంది.దీనికి చిన్న సర్జరీ చేయాల్సి ఉంటుంది. దీనికి కొంత సమయం కూడా పడుతుంది.

    అయితే, రక్త పరీక్ష (లిక్విడ్ బయోప్సీ) ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి శాస్త్రవేత్తలు సరికొత్త పరికరాన్ని రూపొందించారు.

    ఈ పరికరంలో ఉండే ప్రత్యేకమైన బయోచిప్‌ గ్లియోబ్లాస్టోమాకు కారణమైన ఈజీఎఫ్‌ఆర్‌ వంటి కణాలను గుర్తిస్తుంది.

    వివరాలు 

    గ్లియోబ్లాస్టోమా ఏమిటి? 

    రక్తంలో క్రియాశీలంగా ఉండే ఈ కణాలను గుర్తించేందుకు ఈ సాంకేతికత ఎంతో సహాయపడుతుందని నాట్రదామ్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ సూ-చియా చాంగ్‌ తెలిపారు.

    ప్రస్తుతం ఈ పరికరం ప్రయోగ దశలో ఉన్నప్పటికీ, పూర్తిగా అందుబాటులోకి వచ్చినప్పుడు దీని ధర రూ. 168 కంటే తక్కువగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

    గ్లియోబ్లాస్టోమా అనేది మెదడు క్యాన్సర్‌లో అత్యంత వేగంగా వ్యాపించే రకం. దీనికి సమర్థవంతమైన చికిత్స లభించదు.

    వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత బాధితులు సాధారణంగా 12 నుంచి 18 నెలల వరకు మాత్రమే జీవించే అవకాశం ఉంటుంది.

    అయితే, కీమోథెరపీ వంటి చికిత్సలు ఉపయోగించి, వ్యాధి తీవ్రతను తగ్గించడంతో పాటు బాధితులు కొంతకాలం ఎక్కువగా జీవించే అవకాశాన్ని పరిశోధకులు అందిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025