WhatsApp: వాట్సాప్లో కొత్త ఫీచర్.. చదివిన వెంటనే మెసేజ్ డిలీట్!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగంలో ఉన్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్ను పరీక్షిస్తోంది. వినియోగదారుల ప్రైవసీని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో 'సీక్రెట్ మెసేజ్' కాన్సెప్ట్లో భాగంగా ఈ ఫీచర్ను అభివృద్ధి చేస్తోంది. WABetaInfo వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కొత్త ఫీచర్ ప్రస్తుతం బీటా దశలో ఉండి కొద్దిమంది వినియోగదారులకు మాత్రమే పరీక్షార్థం అందుబాటులో ఉంది. గూగుల్ ప్లే స్టోర్లో ఉన్న వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.12.2లో ఈ ఫీచర్ను గుర్తించారు. ఈ ఫీచర్కు 'After Reading' అనే పేరు ఇచ్చారు. అంటే ఒకసారి మెసేజ్ చదివిన వెంటనే అది స్వయంచాలకంగా డిలీట్ అవుతుంది.
వివరాలు
చదివిన వెంటనే ఆటోమేటిక్గా మాయం
ఇప్పటి వరకు వాట్సాప్ లో ఉన్న 'Disappearing Messages' ఫీచర్లో వినియోగదారులు 24 గంటలు, 7 రోజులు, 90 రోజులు వంటి కాలపరిమితిని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ సమయం పూర్తయిన తర్వాతే మెసేజ్లు తొలగిపోతాయి. కానీ కొత్త 'After Reading' ఫీచర్లో మాత్రం ఎలాంటి టైమ్ లిమిట్ అవసరం ఉండదు. మెసేజ్ రిసీవర్ చదివిన వెంటనే అది ఆటోమేటిక్గా మాయం అవుతుంది. సీక్రెట్ మెసేజ్ పంపాలనుకునే వినియోగదారులు మెసేజ్ పంపే సమయంలో ఈ ఆప్షన్ను ఎంపిక చేయాలి. ఈ ఫీచర్కు సంబంధించిన స్క్రీన్షాట్ను కూడా WABetaInfo షేర్ చేసింది.
వివరాలు
ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు
అందులో 'After Reading'తో పాటు 24 గంటలు, 7 రోజులు, 90 రోజులు, ఆఫ్ వంటి ఎంపికలు కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫీచర్ సాధారణ వినియోగదారులకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై ఇప్పటివరకు WhatsApp నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మొత్తం మీద ఈ కొత్త ఫీచర్ వినియోగదారుల ప్రైవసీని మరింత మెరుగుపరచడంలో కీలకంగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.