NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Earth's Magnetic Poles: రష్యా వైపు కదులుతున్న ఉత్తర ధ్రువం.. భూమి భవిష్యత్తుపై అనుమానాలు
    తదుపరి వార్తా కథనం
    Earth's Magnetic Poles: రష్యా వైపు కదులుతున్న ఉత్తర ధ్రువం.. భూమి భవిష్యత్తుపై అనుమానాలు
    రష్యా వైపు కదులుతున్న ఉత్తర ధ్రువం.. భూమి భవిష్యత్తుపై అనుమానాలు

    Earth's Magnetic Poles: రష్యా వైపు కదులుతున్న ఉత్తర ధ్రువం.. భూమి భవిష్యత్తుపై అనుమానాలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 20, 2024
    05:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భూమి అయస్కాంత క్షేత్రంలో వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని బ్రిటన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

    ముఖ్యంగా భూమి ఉత్తర ధ్రువం రష్యా వైపు కదులుతోందని పరిశోధకులు నిర్ధారించారు. లైవ్ సైన్స్ నివేదిక ప్రకారం, శాస్త్రవేత్తలు దశాబ్ధాలుగా ఉత్తర ధ్రువాన్ని ట్రాక్ చేస్తున్నారు.

    1990-2005 మధ్య ఈ ధ్రువం కదలిక రేటు ఏడాదికి 15 కిలోమీటర్ల నుంచి 50-60 కిలోమీటర్లకు పెరిగినట్లు చెబుతున్నారు.

    భూమి అయస్కాంత క్షేత్రం మన గమన సామర్థ్యాల నుంచి భూగోళ రక్షణ వరకు కీలకమైన పాత్ర పోషిస్తుంది.

    నావిగేషన్ వ్యవస్థలు, గ్లోబల్ పాజిషనింగ్ సిస్టమ్ వంటి టెక్నాలజీలు ఈ క్షేత్రంపై ఆధారపడుతున్నాయి.

    Details

    జీవాలకు పెను ప్రమాదం

    ఈ క్షేత్రం భూమి మీద జీవాలకు ప్రమాదకరమైన రేడియేషన్‌ను నిరోధించి భూ వాతావరణాన్ని రక్షిస్తుంది.

    శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ఈ కదలికలు ఇలాగే కొనసాగితే రాబోయే దశాబ్దాల్లో ఉత్తర ధ్రువం సుమారు 660 కిలోమీటర్లు కదిలే అవకాశం ఉంది.

    బ్రిటీష్ జియోలాజికల్ సర్వే ప్రకారం, 2040 నాటికి దిక్సూచిలు నిజమైన ఉత్తరానికి కాకుండా తూర్పు వైపుగా సూచించవచ్చు.

    ఒకే విధంగా, దక్షిణ ధ్రువం కూడా కదులుతూ అంటార్కిటికా మీదుగా తూర్పు వైపునకు జారిపోతుంది.

    ఇది ప్రతి 3 లక్షల సంవత్సరాలకు జరిగే ప్రక్రియ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చివరిసారిగా ధ్రువ మార్పు సుమారు 7,80,000 ఏళ్ల క్రితం జరిగింది.

    Details

    భూగోళంపై ప్రభావం చూపే అవకాశం

    భూమి బయటి కోర్‌లోని ద్రవరూప ఇనుము అసాధారణ మార్గాల్లో ప్రవహించడం వల్ల ఈ మార్పులు జరుగుతాయి.

    ధ్రువాలు మారుతున్నప్పుడు, భూమి అయస్కాంత క్షేత్రం తాత్కాలికంగా జీరో స్థాయికి చేరే ప్రమాదం ఉంటుంది.

    భూమి అయస్కాంత క్షేత్రం కనుమరుగైతే, సౌర వాయువులు భూమిపై విరుచుకుపడి జీవరాశులకు తీవ్రమైన ముప్పు తెస్తాయి.

    భూమి రక్షణకు అయస్కాంత క్షేత్రం ఎంత ముఖ్యమో శాస్త్రవేత్తల అధ్యయనాలు చాటి చెబుతున్నాయి. రాబోయే కాలంలో ఈ మార్పులు భూగోళంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భూమి
    బ్రిటన్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    భూమి

    రేపు శాటిలైట్ రీ-ఎంట్రీ ప్రయోగాన్ని నిర్వహించనున్న ఇస్రో ఇస్రో
    100కు పైగా దేశాల కార్బన్ ఫూట్ ప్రింట్ ను నాసా ఎలా కొలిచిందంటే... నాసా
    సమీపిస్తున్న ఉపగ్రహాన్ని ఢీకొనకుండా తప్పించుకున్న ISS నాసా
    భూమిపై సూర్యుడి పుట్టుకకంటే ముందే నీరు ఆవిర్భావం సూర్యుడు

    బ్రిటన్

    బ్రిటన్ రాజు ప్రతి ఏటా రెండు పుట్టిన రోజులను ఎందుకు జరుపుకుంటారో తెలుసా? తాజా వార్తలు
    కెనడాలో ఖలిస్థానీ 'వాంటెడ్ టెర్రరిస్ట్' హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హతం  ఖలిస్థానీ
    రిషి సునక్ తల్లి చేసిన 'బర్ఫీ'ని రుచి చూసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ రిషి సునక్
    కాక్‌టెయిల్స్ ఛాలెంజ్‌‍లో పాల్గొన్న యూకే వ్యక్తి ; 12 పెగ్గులు తాగిన తర్వాత ఆగిన గుండె జమైకా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025