Starlink: ఎలాన్ మస్క్ స్పేస్ఎక్స్.. త్వరలో ఉపగ్రహ సేవలకు సెక్యూరిటీ టెస్టులు
ఈ వార్తాకథనం ఏంటి
ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్-X తమ ఉపగ్రహ బ్రాడ్బ్యాండ్ సర్వీసులను భారత్లో ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. స్టార్ లింక్ కోసం భారత టెలికాం ఆపరేటర్ల క్లియరెన్స్ ప్రక్రియలో భాగంగా సెక్యూరిటీ టెస్టులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) ఉపగ్రహ సేవలకు తుది ధరల ఫ్రేమ్వర్క్ ప్రకటించిన తర్వాత, స్టార్లింక్ 2026 ప్రారంభంలో భారత్ లో ఇంటర్నెట్ సర్వీసులు అందించడం ప్రారంభించవచ్చు కంపెనీ భారత్ లో కనీసం 10 గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ తన నెట్వర్క్ విస్తరణలో ఉంది. ముంబై, నోయిడా, చండీగఢ్, కోలకతా, లక్నో వంటి ప్రధాన నగరాలలో వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
వివరాలు
త్వరలో ప్రారంభం కానున్న సైట్ ఇన్స్పెక్షన్లు
ఈ సంఖ్య, ప్రధాన పోటీదారులు రిలయన్స్ జియో స్పేస్ ఫైబర్, యూటెల్సాట్ వన్ఓబ్ కంటే మూడింతలు ఎక్కువ. ముంబైలో ఇప్పటికే మూడు గ్రౌండ్ స్టేషన్లు ఏర్పాటయ్యాయి, సైట్ ఇన్స్పెక్షన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, స్టార్ లింక్ భారత్లో ఉపగ్రహ కమ్యూనికేషన్ మార్కెట్లో కొత్త విప్లవాత్మక మార్పులు తెస్తుందనే విశ్లేషణ ఉంది. కంపెనీ ఇప్పటికే ఆపరేషన్లకు అవసరమైన అనుమతులు పొందింది. నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు కేటాయించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రయత్నంలో ప్రైవేట్ ప్లేయర్ల కోసం స్పేస్ ఎకానమీని తెరవడం, ఫైబర్, మొబైల్ నెట్వర్క్లలో ఉన్న కవరేజ్ లోపాలను పూరించడం లక్ష్యం.
వివరాలు
తక్కువ కక్ష్యా ఉపగ్రహ కూటమి ద్వారా సర్వీసులు
స్టార్ లింక్ ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పెద్ద సంఖ్యలో అండర్-సర్వ్డ్ పాపులేషన్పై దృష్టి పెట్టింది, వీరికి వేగవంతమైన ఇంటర్నెట్ అందడం సులభం కాదు. తక్కువ కక్ష్యా ఉపగ్రహ కూటమి ద్వారా ఈ సర్వీసులు అందిస్తారు. జియో, వన్ వెబ్ వంటి పోటీదారులు ఎక్కువగా ప్రభుత్వ, ఎంటర్ప్రైజ్ క్లయింట్లపై దృష్టి పెట్టగా, స్టార్ లింక్ నగర ప్రాంతాల్లో రిటైల్ వినియోగదార్లకు నేరుగా సర్వీసులు విక్రయించే వ్యూహాన్ని అవలంబిస్తోంది.