Climate Breakdown: ఫాసిల్ ఇంధనాల తగ్గింపుతోనే భూమిని కాపాడగలం: క్లైమేట్ అనలిటిక్స్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచం 1.5 డిగ్రీల సెల్సియస్ వాతావరణ లక్ష్యాన్ని ఇంకా చేరుకునే అవకాశం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకుంటే, పెద్ద నష్టం నుంచి ప్రపంచాన్ని కాపాడగలనని తాజా క్లైమేట్ అనలిటిక్స్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశాల లక్ష్యాలు సరిపోవడం లేదని, వాటిని వెంటనే కఠినంగా మార్చాలని సూచించింది. దీనిలో భాగంగా పునర్వినియోగ శక్తుల వినియోగాన్ని విస్తృతం చేయడం, రవాణా, గృహవేడి, పరిశ్రమ రంగాల్లో విద్యుతీకరణను పెంచడం అత్యవసరమని పేర్కొంది.
వివరాలు
భూమి ఉష్ణోగ్రతలు 2.3°C నుండి 2.5°C వరకు పెరిగే ప్రమాదం
బ్రెజిల్లోని అమెజాన్ నదీ ముఖద్వారం సమీపంలోని బెలేం నగరంలో గురువారం, శుక్రవారం ప్రపంచ నేతలు సమావేశమై వాతావరణ మార్పులపై చర్చలు జరుపుతున్నారు. వచ్చే సోమవారం ప్రారంభమయ్యే COP30 సమావేశానికి ముందు ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ఉష్ణోగ్రతలు గత రెండు సంవత్సరాలుగా పారిస్ ఒప్పందంలో నిర్ణయించిన 1.5°C హద్దును దాటి పోయాయి. యునైటెడ్ నేషన్స్ పర్యావరణ సంస్థ తాజా నివేదిక ప్రకారం, ప్రస్తుత దేశాల ప్రణాళికల ప్రకారం భూమి ఉష్ణోగ్రతలు 2.3°C నుండి 2.5°C వరకు పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది. ఇది తీవ్ర వాతావరణ మార్పులు, భారీ నష్టాలకు దారితీయవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
వివరాలు
శతాబ్దం చివరికి మళ్లీ 1.5°Cవరకు తగ్గించే అవకాశం
క్లైమేట్ అనలిటిక్స్ పరిశోధకులు తమ రోడ్మ్యాప్లో,2050 నాటికి ఉష్ణోగ్రతలను గరిష్ఠంగా 1.7°C వద్ద ఆపి, శతాబ్దం చివరికి మళ్లీ 1.5°Cవరకు తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. ఇందుకోసం బొగ్గు, చమురు, వాయు వంటి ఫాసిల్ ఇంధనాలను పూర్తిగా తగ్గించడం,వాతావరణంలో ఉన్న కార్బన్ను తొలగించే శుద్ధి సాంకేతిక పద్ధతుల్ని వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు. అయితే 1.5°Cదాటడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతిని,గ్రీన్లాండ్ మంచు కరిగిపోవడం, అమెజాన్ అడవులు కార్బన్ను శోషించే స్థితి నుంచి కార్బన్ విడుదల చేసే దిశగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. క్లైమేట్ అనలిటిక్స్ CEO బిల్ హేర్ మాట్లాడుతూ,"1.5°Cహద్దును దాటి పోవడం రాజకీయ వైఫల్యమే.అయితే ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకుంటే,శతాబ్దం చివరికి మళ్లీ వాతావరణాన్ని సురక్షిత స్థాయికి తీసుకురాగలం" అన్నారు.
వివరాలు
2035 నాటికి కార్బన్ ఉద్గారాలు కేవలం 10% మాత్రమే తగ్గవవ్హచ్చు: UN
COP30లో అన్ని దేశాలు తమ వాతావరణ ప్రణాళికలను (NDCs) సమర్పించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు సగానికి తక్కువ దేశాలు మాత్రమే ప్రణాళికలు సమర్పించాయి. ప్రస్తుత ప్రణాళికల ప్రకారం 2035 నాటికి కార్బన్ ఉద్గారాలు కేవలం 10% మాత్రమే తగ్గవచ్చని ఐరాస చెబుతోంది. అయితే 1.7°C లక్ష్యం చేరుకోవాలంటే 2030 నాటికి ప్రపంచ ఉద్గారాలను కనీసం 20% తగ్గించాలి, 2030 తర్వాత ప్రతి సంవత్సరం 11% చొప్పున తగ్గిస్తూ వెళ్లాలని క్లైమేట్ అనలిటిక్స్ సూచించింది. అదే విధంగా మీథేన్ ఉద్గారాలను 2035 నాటికి 30% తగ్గించాలని పేర్కొంది.
వివరాలు
కోల్పోయిన సమయాన్ని తిరిగి సాధించవచ్చు
క్లైమేట్ అనలిటిక్స్ సీనియర్ నిపుణుడు నీల్ గ్రాంట్ మాట్లాడుతూ, "గత ఐదు సంవత్సరాలు వాతావరణ చర్యల కోసం ముఖ్యమైన సమయాన్ని కోల్పోయాం. కానీ ఇదే సమయంలో పునర్వినియోగ శక్తి, బ్యాటరీ రంగాల్లో విప్లవాత్మక అభివృద్ధి జరిగింది. ఈ వేగాన్ని ఉపయోగించి మళ్లీ కోల్పోయిన సమయాన్ని తిరిగి సాధించవచ్చు" అని అన్నారు.