AI: ఏఐ మీ మనసులోని మాటలు చదువుతుంది.. 2 గంటలు మాట్లాడితే రూ.4,500 వరకు ఇస్తారట!
ఈ వార్తాకథనం ఏంటి
1908లో కొలంబియా యూనివర్సిటీకి చెందిన సైకియాట్రీ ప్రొఫెసర్ ఫ్రెడరిక్ పీటర్సన్ తాను ఓ "సైకోమీటర్"ను తయారు చేసినట్లు ప్రకటించారు. అద్దం, దీపం వంటి పరికరాలతో రూపొందించిన ఈ యంత్రం మనుషుల ఆలోచనలను చదవగలదని ఆయన చెప్పేవారు. "ఒక వ్యక్తికి కొన్ని పదాలను చెప్పినప్పుడు ఈ పరికరం ఎలా స్పందిస్తుందో చూడటం దాదాపు మంత్రవిద్యను చూసినట్టే ఉంటుంది. అందులో కొన్ని పదాలు ఎలాంటి భావోద్వేగం కలిగించనివి కాగా.. మరికొన్ని వ్యక్తి మనసులోని లోతైన భావోద్వేగాలను తట్టిలేపేవి" అని పీటర్సన్ అప్పట్లో సియాటిల్ స్టార్కు తెలిపారు.
వివరాలు
ఆ దిశగా తొలి అడుగులు..
పీటర్సన్ తయారు చేసిన సైకోమీటర్ నిజంగా పనిచేసిందా లేదా ఓయిజా బోర్డు తరహా భ్రమేనా అన్నది పక్కన పెడితే.. ప్రస్తుతం మాత్రం మనిషి ఆలోచనలను రికార్డు చేసి, వాటిని అర్థం చేసుకోగల యంత్రాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని పలువురు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని నమూనాలను గుర్తించే సామర్థ్యంతో ఇది సాధ్యమవుతుందని చెబుతున్నారు.
జూన్లో మెటా తన తాజా "Brain2Qwerty" సిస్టమ్ను ఆవిష్కరించింది. మెదడు స్కాన్లను టెక్స్ట్గా మార్చేలా ఈ సిస్టమ్ను రూపొందించారు.
ALSతో పాటు ఇతర న్యూరోడీజెనరేటివ్ వ్యాధులతో బాధపడుతూ మాట్లాడే సామర్థ్యాన్ని కోల్పోయిన వారికి తిరిగి కమ్యూనికేట్ చేసే అవకాశం కల్పించే దిశగా ఇది తొలి అడుగుగా మెటా ప్రచారం చేస్తోంది.
వివరాలు
మనసును చదివే సాంకేతికత..
ఇదే తరహాలో ఏఐతో మనసును చదివే సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన స్టార్టప్ "కండ్యూట్" కూడా ప్రయత్నిస్తోంది.
2024లో ప్రారంభమైన ఈ సంస్థ.. శస్త్రచికిత్స అవసరం లేకుండానే మనిషి ఆలోచనలను చదవగల ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
దీనిని సంస్థ తన వెబ్సైట్లో "టెలిపతి ఎట్ స్కేల్"గా అభివర్ణిస్తోంది.
అంటే ఎలాన్ మస్క్కు చెందిన న్యూరాలింక్ అభివృద్ధి చేస్తున్నట్లుగా మెదడులోకి శస్త్రచికిత్స ద్వారా బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ను అమర్చాల్సిన అవసరం ఉండదు.
పూర్తిగా నాన్-ఇన్వేసివ్ విధానంలోనే ఈ టెక్నాలజీ పనిచేయాలన్నది కండ్యూట్ లక్ష్యం.