తదుపరి వార్తా కథనం

Nobel Prize 2025: ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 13, 2025
03:40 pm
ఈ వార్తాకథనం ఏంటి
రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ 2025 సంవత్సరానికి ఆర్థిక శాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం (Nobel Prize in Economic Sciences) ఎవరికీ ఇస్తుందో ప్రకటించింది. ఈ సంవత్సరానికి ముగ్గురి శాస్త్రవేత్తలకు ఈ పురస్కారం అందుతోంది. 'ఆవిష్కరణల ఆధారిత ఆర్థిక వృద్ధి' (Innovation-Based Economic Growth) అనే అంశంపై చేసిన ముఖ్య పరిశోధనలకు జోయెల్ మోకిర్, ఫిలిప్ అఘియన్, పీటర్ హౌవిట్ ఈ అవార్డును అందుకుంటున్నారు. ఇక వైద్య విభాగం నుండి ప్రారంభించిన నోబెల్ పురస్కారాల ప్రకటనలు ఈ రోజు ముగిసాయి.