Team India History: 11 వరుస సిరీస్ విజయాలు.. టీమిండియా ఆధిపత్యానికి మరో నిదర్శనం!
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 అంతర్జాతీయ క్రికెట్లో స్థిరత్వం సాధించడం, గెలుపు పరంపరను కొనసాగించడం ఏ జట్టుకైనా పెద్ద సవాలుగా మారుతుంది. అయితే ఈ విషయంలో భారత జట్టు ప్రపంచ క్రికెట్లోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. పూర్తి సభ్య దేశాల (ఫుల్ మెంబర్ టీమ్స్) మధ్య జరిగిన టీ20 అంతర్జాతీయ సిరీస్లలో వరుస విజయాల పరంగా టీమిండియా అద్భుత రికార్డులను నమోదు చేస్తోంది. తాజా గణాంకాల ప్రకారం భారత్ ప్రస్తుతం వరుసగా 11 టీ20 అంతర్జాతీయ సిరీస్లను గెలుచుకుని అగ్రస్థానంలో నిలిచింది. ఈ విజయ పరంపర 2024 నుంచి కొనసాగుతోంది. ఇదే క్రమంలో దాయాది పాకిస్థాన్ 2016 నుంచి 2018 మధ్య 11 వరుస టీ20 సిరీస్లు గెలుచుకున్న ఘనతను నమోదు చేసింది.
Details
విషయాల విజయంలో భారత్ ముందంజ
ప్రస్తుతం భారత్ అదే స్థాయిని చేరుకొని, మరింత ముందుకు దూసుకెళ్లే దశలో ఉంది. రాబోయే సిరీస్లతో టీమిండియా ఈ రికార్డును మరింత మెరుగుపర్చే అవకాశం కూడా ఉంది. ఇంతకుముందు కూడా భారత జట్టు టీ20 ఫార్మాట్లో తన ఆధిపత్యాన్ని పలుమార్లు చాటింది. 2017-18 మధ్య కాలంలో భారత్ వరుసగా 7 టీ20 సిరీస్లు గెలుచుకోగా, 2019-21మధ్య మరోసారి 6వరుస సిరీస్ విజయాలు సాధించింది. ఈ గణాంకాలు టీ20 అంతర్జాతీయ క్రికెట్లో భారత జట్టు ఎంతకాలంగా స్థిరంగా ప్రదర్శిస్తోందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. స్వదేశంలో వరుస సిరీస్ విజయాల విషయంలోనూ భారత్ ముందంజలో నిలిచింది. 2022 నుంచి 2026 వరకు స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్లలో భారత్ వరుసగా 10విజయాలు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది.
Details
ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న భారత జట్టు
ఈ జాబితాలో ఆస్ట్రేలియా 2006 నుంచి 2010 మధ్య 8 వరుస టీ20 సిరీస్లు గెలుచుకోగా, భారత్ మరోసారి 2019 నుంచి 2022 మధ్య 7 సిరీస్లు గెలుచుకుంది. అలాగే పాకిస్థాన్ 2008 నుంచి 2018 మధ్య 5 వరుస టీ20 సిరీస్ విజయాలను నమోదు చేసింది. మొత్తంగా చూస్తే, టీ20 అంతర్జాతీయ క్రికెట్లో వరుస సిరీస్ విజయాల పరంగా భారత జట్టు ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ను శాసిస్తోంది. యువ ఆటగాళ్ల ఉత్సాహం, అనుభవజ్ఞుల సమతుల్యత, దూకుడైన ఆటతీరు కలసి టీమిండియాను పొట్టి ఫార్మాట్లో అజేయ శక్తిగా మార్చాయి. ఈ గెలుపు పరంపర ఎంత దూరం వరకు కొనసాగుతుందో చూడాల్సి ఉంది.