
IND vs AUS: 50 ఏళ్లలో ఎన్నడూ చూడని రికార్డు.. అడిలైట్లో ఆశలన్నీ కోహ్లీపైనే!
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో భాగంగా భారత జట్టు అడిలైడ్ ఓవల్లో రెండో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అనేక చారిత్రాత్మక రికార్డులు సృష్టించే అవకాశం కలిగి ఉన్నాడు. అడిలైడ్ ఓవల్లో అతని గణాంకాలు ఇప్పటికే ఆకట్టుకుంటున్నాయి. మూడు వన్డేల సిరీస్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 23న అడిలైడ్ ఓవల్లో రెండో మ్యాచ్ జరగనుంది. సిరీస్లోని తొలి మ్యాచ్లో కోహ్లీ ఖాతా తెరవడంలో విఫలమయ్యాడు. కాబట్టి ఈ మ్యాచ్లో అతనిపై అభిమానుల దృష్టి కోహ్లీపై పడింది. అభిమానులు అతని నుంచి బలమైన పునరాగమనాన్ని ఆశిస్తున్నారు. భారీ ఇన్నింగ్స్ స్కోర్ చేస్తే, కోహ్లీ అనేక ప్రధాన రికార్డులను సాధించవచ్చు.
Details
చరిత్ర సృష్టించే అవకాశాలు
కోహ్లీ ఇప్పటివరకు అడిలైడ్లో 12 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి, ఐదు సెంచరీలతో 975 పరుగులు, సగటు 65. వన్డే ఫార్మాట్లో రెండు, టెస్ట్ ఫార్మాట్లో మూడు సెంచరీలు సాధించాడు. ఈ మ్యాచ్లో సెంచరీ సాధిస్తే, అడిలైడ్ ఓవల్లో అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన ఆటగాడిగా అవతరించనున్నాడు. ఈ రికార్డు ఆస్ట్రేలియన్ మాత్రమే కాక, ప్రపంచంలోని చాలా క్రికెటర్లను అధిగమిస్తుంది. 1975 నుంచి అడిలైడ్లో వన్డేలు జరుగుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఎవరు మూడు సెంచరీలు సాధించలేకపోయారు.
Details
మరొక చారిత్రాత్మక మైలురాయికి దూరంలో కోహ్లీ
ఈ వన్డేలో సెంచరీ సాధిస్తే అస్ట్రేలియాలోని ఒకే మైదానంలో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు సాధించిన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆటగాడు జాక్ హాబ్స్ (MCGలో ఐదు సెంచరీలు)తో కోహ్లీ సమం అయ్యాడు. అదనంగా, ఈ మ్యాచ్లో కోహ్లీ 25 పరుగులు సాధిస్తే, అడిలైడ్ ఓవల్లో 1,000 అంతర్జాతీయ పరుగులు చేసిన తొలి విదేశీ ఆటగాడిగా రికార్డు సాధిస్తాడు. ప్రస్తుతం ఈ మైదానంలో అతను అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. ఈ సందర్భంగా, అడిలైడ్ ఓవల్లో కోహ్లీని చూడటం క్రికెట్ అభిమానుల కోసం ఒక చారిత్రాత్మక రోజు అవుతుంది.