Loading...
Abhishek Sharma Records:రికార్డుల మోత మోగించిన అభిషేక్‌ శర్మ.. అఫ్గాన్‌పై విధ్వంసక బ్యాటింగ్‌!
రికార్డుల మోత మోగించిన అభిషేక్‌ శర్మ.. అఫ్గాన్‌పై విధ్వంసక బ్యాటింగ్‌!

Abhishek Sharma Records:రికార్డుల మోత మోగించిన అభిషేక్‌ శర్మ.. అఫ్గాన్‌పై విధ్వంసక బ్యాటింగ్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2026
09:45 am

ఈ వార్తాకథనం ఏంటి

అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత ఓపెనర్ 'అభిషేక్ శర్మ' విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్‌లో 157 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ కేవలం 13.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్‌ శర్మ.. కేవలం 32 బంతుల్లోనే 82 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. అభిషేక్‌ శర్మ కేవలం 22 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. మొత్తం 256.25 స్ట్రైక్‌రేట్‌తో చెలరేగిన అభిషేక్‌.. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో 250కుపైగా స్ట్రైక్‌రేట్‌తో 50కిపైగా పరుగులు చేయడం ఇది మూడోసారి. దీంతో ఈ ఘనతను అత్యధికసార్లు సాధించిన భారత బ్యాటర్‌గా నిలిచాడు.

వివరాలు

6,000 టీ20 పరుగుల మైలురాయి

ఇప్పటివరకు సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ ఫీట్‌ను రెండుసార్లు సాధించాడు.

అభిషేక్‌ శర్మ ఈ ఇన్నింగ్స్‌లోనే టీ20 క్రికెట్‌లో 6,000 పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు.

కేవలం 3,420 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు. తద్వారా అత్యంత వేగంగా 6,000 టీ20 పరుగులు చేసిన ఆసియా బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

వివరాలు

తొలి ఓవర్‌లో సిక్సర్లలో రోహిత్‌తో సమం

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే సిక్సర్‌ బాదడం అభిషేక్‌ శర్మకు ప్రత్యేకమైన అలవాటుగా మారింది.

అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ తొలి ఓవర్‌లో సిక్సర్‌ కొట్టిన అతడు.. భారత్‌ తరఫున ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో రోహిత్‌ శర్మతో కలిసి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

అభిషేక్‌ శర్మ ఇప్పటివరకు తొలి ఓవర్‌లో 12 సిక్సర్లు బాదాడు. రోహిత్‌ శర్మ కూడా 12 సార్లు ఈ ఘనత సాధించాడు. అయితే ఈ రికార్డు కోసం రోహిత్‌ 401 బంతులు ఎదుర్కోగా.. అభిషేక్‌ కేవలం 152 బంతుల్లోనే 12 సిక్సర్లు బాదడం విశేషం.

ADVERTISEMENT

వివరాలు

అఫ్గాన్‌ 156/8

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.

ఆ జట్టులో అజ్మతుల్లా ఒమర్జాయ్‌ 44 బంతుల్లో 64 పరుగులతో అజేయంగా నిలిచాడు. మహ్మద్‌ నబీ 33 పరుగులు చేశాడు.

భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్‌ బుమ్రా, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి చెరో వికెట్‌ తీశారు.

ADVERTISEMENT

వివరాలు

ఇషాన్‌ కిషన్‌ కీలక సహకారం

157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు అభిషేక్‌ శర్మతో పాటు ఇషాన్‌ కిషన్ కూడా కీలక సహకారం అందించాడు.

ఇషాన్‌ 33 బంతుల్లో 42 పరుగులు చేశాడు. అనంతరం చివర్లో శ్రేయస్‌ అయ్యర్‌, తిలక్‌ వర్మ కలిసి భారత్‌ను విజయతీరాలకు చేర్చారు.

దీంతో భారత్‌ 38 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌పై ఘన విజయం సాధించింది.

విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత విజయాన్ని సులభతరం చేసిన అభిషేక్‌ శర్మకు 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అవార్డు దక్కింది.

ADVERTISEMENT