IPL 2026: రహానే అరుదైన ఘనత.. 200 మ్యాచ్లు ఆడిన 11వ ఆటగాడిగా రికార్డ్
ఈ వార్తాకథనం ఏంటి
భారత క్రికెటర్ అజింక్య రహానే ఐపీఎల్లో మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నాడు. తన 200వ మ్యాచ్ ఆడి ఈ ఘనత సాధించాడు. కోల్కతా జట్టుకు నాయకత్వం వహిస్తూ నేడు హైదరాబాద్పై మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా ఈ ఘనత సాధించారు. రహానే ఐపీఎల్ చరిత్రలో 200 మ్యాచ్లు పూర్తి చేసిన 11వ ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్లోనే ఆడిన ఆటగాళ్లలో రహానే ఒకరు. ఇప్పటివరకు అతను అద్భుతమైన కెరీర్ను నిర్మించుకున్నాడు. వివిధ జట్ల తరఫున ఆడుతూ 5,000కు పైగా పరుగులు సాధించాడు. అతని సగటు సుమారు 30.71గా ఉండగా, స్ట్రైక్ రేట్ 125కి పైగా ఉంది. అలాగే 2 శతకాలు, 34 అర్ధశతకాలు కూడా అతని ఖాతాలో ఉన్నాయి.
వివరాలు
ఆ జాబితాలో దిగ్గజాలు..
ఈ జాబితాలో మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తిక్, రవీంద్ర జడేజా, శిఖర్ ధవన్, రవిచంద్రన్ అశ్విన్, సురేష్ రైనా, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు వంటి దిగ్గజాలు ఉన్నారు. ఇందులో ధోనీ అత్యధికంగా 278 మ్యాచ్లు ఆడి అగ్రస్థానంలో ఉన్నాడు. రహానే ఐపీఎల్ ప్రయాణం ముంబై జట్టుతో ప్రారంభమైంది. తర్వాత రాజస్థాన్, పుణే, ఢిల్లీ, చెన్నై, కోల్కతా జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా రాజస్థాన్, కోల్కతా జట్లకు రెండు విడతల్లో ఆడాడు.
వివరాలు
500పైగా ఫోర్లతో మరో రికార్డు
ఇక మరో ప్రత్యేక రికార్డు కూడా రహానే పేరిట ఉంది. ఐపీఎల్లో 500కు పైగా ఫోర్లు కొట్టిన అరుదైన ఆటగాళ్లలో రహానే ఒకడు. మొత్తం 517 బౌండరీలతో కోహ్లీ, ధవన్, డేవిడ్ వార్నర్, రోహిత్ తర్వాత స్థానంలో ఉన్నాడు. సురేష్ రైనా (506) కంటే ముందంజలో ఉన్నాడు. మరి ఈ సీజన్లో ఆ రికార్డును దాటే అవకాశం ఉంది.