T20 World Cup 2026: భారత్లో టీ20 వరల్డ్ కప్కు బంగ్లా నో.. పాకిస్తాన్ రెచ్చగొట్టిందా?
ఈ వార్తాకథనం ఏంటి
భారత్లో జరిగే టీ20 వరల్డ్ కప్-2026 మ్యాచ్లకు తమ జట్టు వెళ్లమని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కోల్కతా, ముంబై వేదికలుగా బంగ్లాదేశ్ మ్యాచ్లు జరగాల్సి ఉండగా, వాటిని శ్రీలంకకు మార్చాలని ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ను కోరింది. అయితే ఆ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. అయినప్పటికీ ఢాకా ప్రభుత్వం తన నిర్ణయంపై వెనక్కి తగ్గకుండా, భద్రతా కారణాలను చూపిస్తూ టోర్నమెంట్ నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భారత్లో ఆడితే తమ జట్టుకు నిజమైన భద్రతా ప్రమాదాలు ఉన్నాయని బంగ్లాదేశ్ వాదిస్తోంది.
Details
భారత్ కు ఎలాంటి నష్టం ఉండదు
ఈ నిర్ణయంపై 1983 వరల్డ్ కప్ విజేత, మాజీ భారత పేసర్ మదన్ లాల్ తీవ్రంగా స్పందించారు. టీ20 వరల్డ్ కప్లో పాల్గొనకపోతే భారత్కు ఎలాంటి నష్టం ఉండదని, కానీ బంగ్లాదేశ్కే భారీ నష్టం వాటిల్లుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా వాణిజ్యపరంగా, క్రికెట్ అభివృద్ధి పరంగా బంగ్లాదేశ్ చాలా కోల్పోతుందని అన్నారు. ఇది పూర్తిగా మూర్ఖత్వపు నిర్ణయమని, భారత్కు ఏమాత్రం నష్టం జరగదని, బంగ్లాదేశ్కే అన్నీ నష్టాలేనని మదన్ లాల్ స్పష్టం చేశారు. ఇలాంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో పాల్గొనకపోతే ఆర్థికంగా, వాణిజ్యంగా పెద్ద దెబ్బ పడుతుందని హెచ్చరించారు. ఈ నిర్ణయం వెనుక పాకిస్తాన్ ప్రేరణ ఉందని కూడా ఆయన ఆరోపించారు. భారత్ను కిందకు దించాలనే ఉద్దేశంతోనే బంగ్లాదేశ్ను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు.
Details
భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాల్లో కొంత ఉద్రిక్తత
మరోవైపు బంగ్లాదేశ్ ముంబైలో కూడా మ్యాచ్లు ఆడాల్సి ఉందని, ముంబై దేశంలోనే అత్యంత సురక్షిత నగరాల్లో ఒకటని మదన్ లాల్ గుర్తుచేశారు. భారత క్రికెట్ బోర్డుకు గానీ, భారత్కు గానీ ఈ నిర్ణయం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపారు. ఇది పూర్తిగా రాజకీయ నిర్ణయమేనని, భారత్ను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ విధంగా వ్యవహరిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, ఇటీవలి కాలంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాల్లో కొంత ఉద్రిక్తత నెలకొంది. బంగ్లాదేశ్లో మైనారిటీలపై పెరుగుతున్న దాడులు, హింసాకాండలపై భారత్లో ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
Details
ఐపీఎల్ నుంచిముస్తాఫిజుర్ తొలగింపు
గతేడాది ఈ పరిణామాల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్-2026 కోసం కోల్కతా నైట్రైడర్స్ జట్టులో ఉన్న బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ను విడుదల చేయాలని కోరింది. అనంతరం ముస్తాఫిజుర్ను ఐపీఎల్ నుంచి తొలగించారు. ఆ తర్వాతే భారత్లో తమ జట్టు భద్రతపై తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయని బంగ్లాదేశ్ పేర్కొంది. ఇదే కారణంతో 2026 టీ20 వరల్డ్ కప్ కోసం భారత్కు రావడాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది.