Page Loader
సెలక్షన్ కమిటీని తొలగించిన DDCA చీఫ్
2022-23 రంజీ ట్రోఫీలో ఢిల్లీ చివరి స్థానం

సెలక్షన్ కమిటీని తొలగించిన DDCA చీఫ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 06, 2023
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

సీనియర్ రాష్ట్ర సెలక్షన్ కమిటీని ఢిల్లీ, డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ తొలగించారు. ప్యానల్‌లో అంతర్గత పోరు, ఎంపికల కారణంగా తప్పించినట్లు సమాచారం. సెలక్షన్ కమిటీ తన విధులను నిర్వర్తిస్తున్న తీరుపై గతంలో జైట్లీ ప్రశ్నించారు. మంగళవారం, సెలెక్టర్లు గగన్ ఖోడా, కమిటీ చీఫ్, మయాంక్ సిదానా వివాదం జరిగినట్లు సమాచారం. దీంతో రాబోయే CK నాయుడు ట్రోఫీ మ్యాచ్ కోసం ఢిల్లీ అండర్-25 జట్టును ఎంపిక చేయడానికి వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ఏడుసార్లు రంజీ ట్రోఫి సాధించి ఈ సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మహారాష్ట్ర చేతిలో ఢిల్లీ తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత అస్సాం, తమిళనాడుపై డ్రా చేసుకుంది.

జైట్లీ

సెలక్షన్ కమిటీపై జైట్లీ అసంతృప్తి

దీంతో సెలక్షన్ కమిటీపై జైట్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీసీఐ ఆదేశాలకు భిన్నంగా సెలక్షన్ కమిటీ 22 మంది ఆటగాళ్లను ఎలా ఎంపిక చేశారని ఆయన మాట్లాడారు. ఢిల్లీ అండర్-25 జట్టు కోచ్ పంకజ్ సింగ్‌ను సెలక్షన్ కమిటీ సమావేశంలో కూర్చోవడానికి కార్యదర్శి ఎందుకు అనుమతించలేదని జైట్లీ ప్రశ్నించారు. అదే విధంగాLSG మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఆయుష్ బడోని ఓపెనర్‌గా ఫస్ట్-క్లాస్‌లో అరంగేట్రం చేయడంపై చాలా విమర్శలు వచ్చాయి. తొలి ఇన్నింగ్స్‌లో బడోని డకౌట్ అయ్యాడు. ప్రస్తుతానికి, DDCA మిగిలిన సీజన్ కోసం జట్టును ఎంపిక చేస్తుంది. ఈ కమిటీలో భారత మాజీ క్రికెటర్లు నిఖిల్ చోప్రా, గురుశరణ్ సింగ్, రీమా మల్హోత్రా ఉన్నారు.