
Ayush Mhatre: ధోని శిష్యుడు ఆయుష్ మాత్రేకు ముంబై కెప్టెన్సీగా లక్కీ ఛాన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
ఇంగ్లండ్లో టీమిండియాకు అద్భుత విజయాన్ని అందించిన అండర్-19 జట్టు కెప్టెన్ ఆయుష్ మాత్రేకు మరో కీలక బాధ్యత దక్కింది. కొత్త జట్టుకు నాయకత్వం వహించనున్న ఆయనతో పాటు, స్టార్ ఆటగాళ్లు ఉన్న ఈ జట్టులో భారత టెస్ట్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ కూడా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ పర్యటనలో కెప్టెన్సీలో మెరిసిన ఆయుష్, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో కూడా జట్టును నడిపించాడు. ఇప్పుడు ఆయనకు మరో సవాల్ ఎదురవుతోంది.
Details
బుచ్చి బాబు టోర్నమెంట్లో ముంబై కెప్టెన్గా
వచ్చే నెలలో ప్రారంభమయ్యే బుచ్చి బాబు టోర్నమెంట్లో ఆయుష్ మ్హత్రే ముంబై జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ 17 మంది సభ్యుల జట్టులో సర్ఫరాజ్ ఖాన్, అతని సోదరుడు ముషీర్ ఖాన్ కూడా చోటు సంపాదించారు. ముంబై తరపున ఎనిమిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన సువేద్ పార్కర్ను వైస్ కెప్టెన్గా నియమించారు. ఈ టోర్నమెంట్ ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 9 వరకు చెన్నైలో జరుగుతుంది. ముంబై, ఆగస్టు 18న తమిళనాడు డిస్ట్రిక్ట్స్ ఎలెవన్తో తమ ప్రచారాన్ని ఆరంభిస్తుంది.
Details
దేశీయ స్థాయిలో ఆయుష్ ప్రదర్శన
ఇంగ్లండ్ పర్యటనలో రెండు సెంచరీలు చేసిన ఆయుష్, ఇప్పటివరకు 9 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 504 పరుగులు సాధించాడు. 16 ఇన్నింగ్స్లలో ఆయన 31.50 సగటుతో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మరోవైపు, టీమ్ ఇండియాలో తిరిగి ప్రవేశం కోసం కృషి చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ 17 కిలోల బరువు తగ్గాడు. దులీప్ ట్రోఫీ కోసం వెస్ట్ జోన్ జట్టులో సర్ఫరాజ్ ఎంపిక కాగా, ముషీర్ ఖాన్ రిజర్వ్ ప్లేయర్గా ఉన్నాడు.
Details
ముంబై జట్టు (17 మంది సభ్యులు)
ఆయుష్ మ్హత్రే (కెప్టెన్), సువేద్ పార్కర్ (వైస్ కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, దివ్యాంష్ సక్సేనా, ప్రగ్నేష్ కాన్పిల్లెవార్, హర్ష్ అఘవ్, సాయిరాజ్ పాటిల్, ఆకాష్ పార్కర్, ఆకాష్ ఆనంద్ (వికెట్ కీపర్), హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), శ్రేయాస్ సింగ్, దిచ్రాస్ గురవ్, శ్రేయాస్ డిచ్హుల్కర్, సిల్వెస్టర్ డిసౌజా, ఇర్ఫాన్ ఉమైర్.