LOADING...
SRH vs RR: ఎలిమినేటర్‌ పోరు.. ఒక్క అడుగు దూరంలో విజయం..హైదరాబాద్‌ జోరు.. రాజస్థాన్‌ సవాలు
ఎలిమినేటర్‌ పోరు.. ఒక్క అడుగు దూరంలో విజయం..హైదరాబాద్‌ జోరు.. రాజస్థాన్‌ సవాలు

SRH vs RR: ఎలిమినేటర్‌ పోరు.. ఒక్క అడుగు దూరంలో విజయం..హైదరాబాద్‌ జోరు.. రాజస్థాన్‌ సవాలు

వ్రాసిన వారు Moogati Shabari
May 27, 2026
09:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో మరో ఉత్కంఠభరిత పోరుకు రంగం సిద్ధమైంది. బుధవారం జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు రాజస్థాన్‌ రాయల్స్‌తో తలపడనుంది. లీగ్‌ దశలో స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న హైదరాబాద్‌ జట్టు బలంగా కనిపిస్తుండగా, చివరి రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన రాజస్థాన్‌ కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-2కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. అందుకే ఇరు జట్లు విజయం కోసం సమరానికి సిద్ధమయ్యాయి.

వివరాలు

రసవత్తర పోరు నేడు..

గత సీజన్‌లో నిరాశపరిచిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఈసారి మాత్రం అద్భుతంగా పుంజుకుని ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఇప్పుడు రాజస్థాన్‌పై గెలిచి మరో అడుగు ముందుకేయాలనే లక్ష్యంతో ఉంది. లీగ్‌ దశలో ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు నమోదు చేసింది. ఆర్సీబీ, గుజరాత్‌లతో సమానంగా 18 పాయింట్లు సాధించినప్పటికీ, రన్‌రేట్‌ కారణంగా మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు రాజస్థాన్‌ 8 విజయాలతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. రెండు జట్లూ సమర్థవంతమైనవే కావడంతో ఈ పోరు ఆసక్తిని రేకెత్తిస్తోంది.

వివరాలు

ఫామ్‌లో హైదరాబాద్‌..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో కొనసాగుతోంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ అన్ని విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్న ఆ జట్టు ఈ మ్యాచ్‌లో స్వల్ప ఆధిక్యంతో ఉన్నట్టు అనిపిస్తోంది. ప్రారంభంలో కొంత నెమ్మదిగా సాగిన హైదరాబాద్‌ ప్రస్థానం, తర్వాత వేగం అందుకుంది. చివరి పది మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలు సాధించడం వారి జోరును చూపిస్తోంది. కెప్టెన్‌ కమిన్స్‌ చివరి ఏడు మ్యాచ్‌లకు అందుబాటులోకి రావడం జట్టుకు మరింత బలం ఇచ్చింది. ఈ సీజన్‌లో రాజస్థాన్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ హైదరాబాద్‌ విజయం సాధించడం వారికి మానసికంగా ధైర్యాన్నిస్తోంది.

Advertisement

వివరాలు

పోరుకు సిద్ధమైన రాజస్థాన్‌..

రాజస్థాన్‌ రాయల్స్‌ కూడా పూర్తి ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. లీగ్‌ ప్రారంభంలో వరుసగా నాలుగు విజయాలు సాధించి దూసుకెళ్లిన ఆ జట్టు, తర్వాత మధ్యలో తడబడి చివరి మ్యాచ్‌ వరకు ప్లేఆఫ్స్‌ ఆశలను కొనసాగించాల్సి వచ్చింది. అయినప్పటికీ వారి టాప్‌ ఆర్డర్‌ బలంగా నిలిచింది. వైభవ్‌ సూర్యవంశీ (583 పరుగులు), యశస్వి జైస్వాల్‌ (397), ధ్రువ్‌ జురెల్‌ (458) జట్టుకు కీలకంగా నిలిచారు. ముఖ్యంగా జైస్వాల్‌ మరింత స్థిరత్వంతో ఆడాల్సిన అవసరం ఉంది.

Advertisement

వివరాలు

అందరి చూపు అతని వైపే..

అయితే అందరి చూపు ఇప్పుడు 15 ఏళ్ల వైభవ్‌పైనే నిలిచింది. అతడు పవర్‌ప్లే వరకు క్రీజులో నిలిస్తే మ్యాచ్‌ను రాజస్థాన్‌వైపు తిప్పగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. అందుకే హైదరాబాద్‌ బౌలర్లు అతడిపై ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగే అవకాశముంది. కెప్టెన్‌ పరాగ్‌ కూడా ఈ కీలక మ్యాచ్‌లో పెద్ద ఇన్నింగ్స్‌తో జట్టుకు తోడ్పడాలని అభిమానులు ఆశిస్తున్నారు. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్‌ రాజస్థాన్‌కు ప్రధాన బలంగా మారాడు. చివరి లీగ్‌ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించిన అతడు, ఈ సీజన్‌లో 21 వికెట్లు తీసి తన ప్రభావాన్ని చాటాడు. అతనికి తోడుగా బ్రిజేశ్‌ శర్మ (13 వికెట్లు), బర్గర్‌ (11 వికెట్లు) కూడా బాగా రాణించారు.

Advertisement