LOADING...
DC vs KKR: ఢిల్లీ మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా గౌతమ్ గంభీర్.. సెలెక్టర్‌తో కలిసి!
ఢిల్లీ మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా గౌతమ్ గంభీర్.. సెలెక్టర్‌తో కలిసి!

DC vs KKR: ఢిల్లీ మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా గౌతమ్ గంభీర్.. సెలెక్టర్‌తో కలిసి!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 08, 2026
10:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య ఢిల్లీలో జరుగుతున్న మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మ్యాచ్‌కు భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హాజరై సందడి చేశాడు.టీమిండియా సెలెక్టర్ ఆర్‌పీ సింగ్‌తో కలిసి గంభీర్ స్టేడియానికి వచ్చాడు. తన పేరిట ఉన్న స్టాండ్స్‌లోని వీఐపీ బాక్స్‌లో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాతో కలిసి మ్యాచ్‌ను ఆస్వాదించాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌతమ్ గంభీర్ ఐపీఎల్ మ్యాచ్‌కు హాజరవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఐపీఎల్ జరుగుతుండటంతో ఆయనకు ప్రస్తుతం సుదీర్ఘ విరామం లభించింది.

వివరాలు

ఆయన రాకపై అభిమానుల పలు సందేహాలు

ఈ విశ్రాంతి సమయాన్ని ఆయన కుటుంబ సభ్యులతో గడుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే గంభీర్ అకస్మాత్తుగా ఈ మ్యాచ్‌కు హాజరుకావడం పలు ఊహాగానాలకు దారి తీసింది. కేఎల్ రాహుల్ ఆటను ప్రత్యక్షంగా పరిశీలించేందుకే ఆయన వచ్చారని, సంజూ శాంసన్ స్థానంలో రాహుల్‌ను ఎంపిక చేసే అవకాశాలపై దృష్టి పెట్టారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం గంభీర్ తన మాజీ ఫ్రాంచైజీ కేకేఆర్ మ్యాచ్‌ను చూడటానికే వచ్చారని అంటున్నారు. అలాగే తన సొంత మైదానంలో వీఐపీ సౌకర్యాన్ని ఆస్వాదిస్తూ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చినట్టు కూడా కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా గౌతమ్ గంభీర్ ఈ మ్యాచ్‌కు హాజరవడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన రాకపై అభిమానులు, నెటిజన్లు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement