NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IPL 2025: అతను చిచ్చర పిడుగులా రాణిస్తున్నాడు.. వైభవ్ సూర్యవంశీపై మోదీ ప్రశంసలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    IPL 2025: అతను చిచ్చర పిడుగులా రాణిస్తున్నాడు.. వైభవ్ సూర్యవంశీపై మోదీ ప్రశంసలు
    అతను చిచ్చర పిడుగులా రాణిస్తున్నాడు.. వైభవ్ సూర్యవంశీపై మోదీ ప్రశంసలు

    IPL 2025: అతను చిచ్చర పిడుగులా రాణిస్తున్నాడు.. వైభవ్ సూర్యవంశీపై మోదీ ప్రశంసలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 05, 2025
    11:46 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు.

    తన చిన్న వయసులోనే అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యువ ఆటగాడిని ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు.

    బీహార్ వేదికగా మే 4 నుంచి 15 వరకు జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు.

    ఈ సందర్భంగా తన ప్రసంగంలో మోదీ ఐపీఎల్‌లో బీహార్‌కు చెందిన వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ చేశాడు.

    చిన్న వయసులోనే ఇలా రాణించడం గొప్ప విషయం. అతని విజయాల వెనక ఉన్న కృషి అభినందనీయం.

    Details

    నూతన క్రీడలకు అవకాశం

    వరుసగా మ్యాచ్‌లు ఆడి తన ఆటను మెరుగుపరచుకున్నాడు.

    ఎక్కువగా ఆడే వారికి రాణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటూ కొనియాడారు. క్రీడల రంగానికి ఎన్డీఏ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తోందనేదాన్ని ప్రధాని వివరించారు.

    కొత్త క్రీడలకు అవకాశాలు కల్పించేందుకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో గట్కా, ఖోఖో, మల్కాంబ్, యోగాసన వంటి ఆటలను చేర్చినట్లు తెలిపారు.

    ఇప్పుడు యువ అథ్లెట్లు వుషు, లాన్ బాల్స్, రోలర్ స్కేటింగ్ వంటి క్రీడల్లోనూ ప్రతిభ చూపుతున్నారని అన్నారు.

    Details

    ఢిల్లీ వేదికగా షూటింగ్, జిమ్నాస్టిక్స్, ట్రాక్ సైక్లింగ్ ఈవెంట్స్

    మోదీ మాట్లాడుతూ, దేశానికి కొత్త విద్యా విధానం తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ విధానం క్రీడలను విద్యలో భాగంగా చేస్తూ, విద్యార్థులలో ఆటతీరు పెంపొందించేలా రూపుదిద్దుకున్నదని చెప్పారు.

    క్రీడల వల్ల టీమ్ వర్క్, కలసి ముందుకు సాగే తత్వం అలవడుతుందని, జీవితంలో ఇది కీలకమని వివరించారు.

    ఈ ఏడాది ఖేలో ఇండియా యూత్ గేమ్స్ బీహార్‌లోని పాట్నా, రాజ్‌గిర్, గయా, భగల్‌పూర్, బెగుసరాయ్ నగరాల్లో జరుగనున్నాయి.

    ఢిల్లీ వేదికగా షూటింగ్, జిమ్నాస్టిక్స్, ట్రాక్ సైక్లింగ్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    క్రికెట్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    నరేంద్ర మోదీ

    PM Modi: రెండు రోజుల పర్యటన నిమిత్తం థాయ్‌ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  భారతదేశం
    Waqf Amendment Bill: వక్ఫ్‌ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించడంపై ప్రధాని మోదీ హర్షం  భారతదేశం
    PM Modi: ఈశాన్య వ్యాఖ్యల వివాదం.. బంగ్లాదేశ్‌ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్‌తో మోదీ భేటీ  అంతర్జాతీయం
    PM Modi: ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. శ్రీలంక మిత్ర విభూషణ అవార్డు ప్రదానం శ్రీలంక

    క్రికెట్

    IPL 2025: ఐపీఎల్‌లో వేగవంతమైన అర్ధశతకాలు.. రికార్డులు సృష్టించిన ప్లేయర్స్ వీరే! ఐపీఎల్
    Tanmay Srivastava: అండర్ -19వరల్డ్ కప్‌ స్టార్.. ఇప్పుడు ఐపీఎల్లో అంపైర్! టీమిండియా
    BCCI: బీసీసీఐ ఫ్యామిలీ పాలసీలో మార్పులేమీ లేవు.. కార్యదర్శి సైకియా స్పష్టీకరణ బీసీసీఐ
    IPL 2025 : ఐపీఎల్ 2025లో స్మార్ట్‌ రీప్లే సిస్టమ్.. మ్యాచ్ ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా? బీసీసీఐ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025