LOADING...
Year Ender 2025: హీట్ ఆన్ ఫీల్డ్.. ఈ ఏడాది మైదానంలో చోటు చేసుకున్న వివాదాస్పద ఘటనలు ఇవే!
హీట్ ఆన్ ఫీల్డ్.. ఈ ఏడాది మైదానంలో చోటు చేసుకున్న వివాదాస్పద ఘటనలు ఇవే!

Year Ender 2025: హీట్ ఆన్ ఫీల్డ్.. ఈ ఏడాది మైదానంలో చోటు చేసుకున్న వివాదాస్పద ఘటనలు ఇవే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 02, 2025
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్ అంటే కేవలం ఆటే కాదు, ఒక రకమైన యుద్ధం. ఈ యుద్ధంలో విజయం ఒక్క భాగం మాత్రమే. మరో వైపు వివాదాలు నిరంతరం ఆట వెన్నెలో నీడగా ఉంటాయి. 2025 సంవత్సరం కూడా క్రికెట్ అభిమానులకు మర్చిపోలేని, ఉత్కంఠభరిత జ్ఞాపకాలను అందించింది. ఈ ఏడాది ఆటలో కేవలం విజయాలు మాత్రమే కాకుండా మైదానంలో మంటలు రాజేసిన వివాదాస్పద ఘటనలు కూడా సృష్టించారు. సరిహద్దుల రాజకీయాలు ఆటలోకి వెళ్లాయి. ఆటగాళ్ల నోటి దురుసు మైదానం దాటి సర్కిల్ చేసింది.

Details

1. ఆసియా కప్ షేక్ హ్యాండ్ వివాదం

ఆసియా కప్ 2025 టీ20 టోర్నీలో భారత క్రికెటర్లు పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం తీవ్రమైన వివాదాస్పద ఘటనగా మారింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ వంటి భౌతిక, రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. దేశవ్యాప్తంగా పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడవద్దనే డిమాండ్ వినిపించింది. భారత్ ఆ జట్టుకు షేక్ హ్యాండ్ ఇవ్వడంలో నిరాకరించింది. ఈ ఘటనను పీసీబీ అవమానంగా భావించింది, ఐసీసీకి ఫిర్యాదు చేసింది.మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకోవాలని యూఏఈతో బెదిరింపులు కూడా జరిగాయి. చివరకు మ్యాచ్ రిఫరీ క్షమాపణలు తెలిపాడు. విజయానంతరం సూర్యకుమార్ భారత సాయుధ బలగాలకు అంకితమివ్వడం కూడా వివాదాస్పదమైంది. ఐసీసీ రూల్స్‌కు విరుద్ధంగా ఈ చర్యకు మ్యాచ్ ఫీజులో కోత విధించబడింది.

Details

2. రఫెల్ సైగల్ వివాదం 

ఆసియా కప్‌లో పాకిస్తాన్ పేసర్ హారీస్ రౌఫ్, ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ చేసిన సైగలు భారత అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి. రౌఫ్, ఆపరేషన్ సింధూర్‌లో భారత యుద్ధ విమానాలను కూల్చేశామని సైగలు చేశారు. ఫర్హాన్, హాఫ్ సెంచరీ తరువాత తుపాకీ ఎక్కించినట్లుగా సంబరాలు చేసాడు. ఈ రెండు ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐసీసీ మ్యాచ్ ఫీజులో కోత విధించి, డీమెరిట్ పాయింట్లు కేటాయించింది.

Advertisement

Details

 3. ట్రోఫీ ఎత్తుకెళ్లిన పీసీబీ ఛైర్మన్ 

ఆసియా కప్ 2025 ట్రోఫీని విజేతగా నిలిచిన భారత్‌కి ఇవ్వకుండా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మోహ్‌సిన్ నఖ్వీ ఎత్తుకెళ్లడం తీవ్ర వివాదాస్పదమైంది. ఏసీసీ ఛైర్మన్ హోదాలో టైటిల్ ఇవ్వడానికి నఖ్వీ సిద్ధమయ్యారు, కానీ భారత్ నిరాకరించింది. పాకిస్తాన్ ప్రభుత్వ మంత్రిగా ఉన్న నఖ్వీ చేతుల్లో టైటిల్ అందుకోలేమని చెప్పడంతో, టైటిల్ ఎత్తుకెళ్లి పాకిస్తాన్ సంబరాలు చేసుకుంది. ఈ ఘటనపై బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.

Advertisement

Details

4. సఫారీ కోచ్ వివాదాస్పద కామెంట్స్ 

సౌతాఫ్రికాతో ముగిసిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లోనూ వివాదాలు చోటు చేసుకున్నాయి. సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమాను భారత ఆటగాళ్లు పంత్, బుమ్రాకు పొట్టోడా అని సంబోధించడం వివాదాస్పదమైంది. బవుమా పట్టించుకోకపోయినా, బుమ్రా క్షమాపణలు తెలిపారు. రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో త్వరగా డిక్లేర్ చేయకపోవడంపై హెడ్ కోచ్ కొన్రాడ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన "Grovel" అనే పదాన్ని ఉపయోగించారు, ఇది జాత్యహంకారానికి ప్రతీకగా పరిగణించబడింది. భారత మాజీ ఆటగాళ్లు ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు, సౌతాఫ్రికా క్రికెట్ భారత్‌కు చేసిన మేలును మర్చిపోయారా అని మండిపడ్డారు.

Details

ఏకకాలంలో వివాదాలు

2025లో క్రికెట్ ఫీల్డ్‌లో విజయం, ఉత్కంఠ, వివాదాలు ఏకకాలంలో కనిపించాయి. షేక్ హ్యాండ్లు, సైగ్లు, ట్రోఫీ వివాదాలు, కోచ్ కామెంట్స్ అన్ని కలిపి క్రికెట్ అభిమానుల దృష్టిని మైదానానికే నిలిపాయి. ఈ సంవత్సరం కేవలం విజయాలు మాత్రమే కాకుండా, రాజకీయ ఉద్రిక్తతలు, మైదానపు మంటలు, వివాదాస్పద ఘట్టాలను కూడా సృష్టించింది.

Advertisement