NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / WTC - ICC: టెస్టు క్రికెట్‌ను మరింత ప్రోత్సాహించేందుకు ఐసీసీ కీలక నిర్ణయం.. డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీని భారీగా పెంపు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    WTC - ICC: టెస్టు క్రికెట్‌ను మరింత ప్రోత్సాహించేందుకు ఐసీసీ కీలక నిర్ణయం.. డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీని భారీగా పెంపు 
    టెస్టు క్రికెట్‌ను మరింత ప్రోత్సాహించేందుకు ఐసీసీ కీలక నిర్ణయం.. డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీని భారీగా పెంపు

    WTC - ICC: టెస్టు క్రికెట్‌ను మరింత ప్రోత్సాహించేందుకు ఐసీసీ కీలక నిర్ణయం.. డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీని భారీగా పెంపు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 15, 2025
    04:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టెస్టు క్రికెట్‌ను మరింత ఉత్సాహంగా కొనసాగించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

    ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) ప్రైజ్‌మనీని గణనీయంగా పెంచుతూ 2023-25 సీజన్‌కు సంబంధించిన బహుమతిని రూ.49.27 కోట్లుగా నిర్ణయించింది.

    ఈ మొత్తం 5.76 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు సమానం.ఈ డబ్ల్యూటీసీలో పాల్గొన్న తొమ్మిది జట్ల మధ్య ఈ మొత్తాన్ని విభజించనున్నారు.

    గత రెండు టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఎడిషన్లతో పోలిస్తే ఇది భారీ పెంపు. అప్పట్లో ఇచ్చిన ప్రైజ్‌మనీ కేవలం 3.8 మిలియన్ డాలర్లు మాత్రమే.

    తాజా ఎడిషన్‌ ఫైనల్‌లో ఆసీస్‌ (ఆస్ట్రేలియా),దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.

    ఈ మ్యాచ్ జూన్ 11న లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో ప్రారంభం కానుంది.

    వివరాలు 

    భారత జట్టుకు రూ.12.31 కోట్లు

    ఇందులో విజేతగా నిలిచిన జట్టుకు రూ.30.78 కోట్లు లభించనుండగా, రెండో స్థానాన్ని దక్కించుకునే జట్టుకు రూ.18.46 కోట్లు ప్రదానం చేయనున్నట్లు ఐసీసీ ప్రకటించింది.

    పాయింట్ల పట్టిక ఆధారంగా మూడో స్థానాన్ని సంపాదించిన భారత జట్టుకు రూ.12.31 కోట్లు లభించనున్నాయి.

    అలాగే, నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌ జట్టుకు రూ.10.26 కోట్లు,ఐదో స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్‌ జట్టుకు రూ.8.2 కోట్లు లభించనున్నాయి.

    ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న జట్లకు వరుసగా.. శ్రీలంకకు రూ.7.18 కోట్లు,బంగ్లాదేశ్‌కు రూ.6.15 కోట్లు, వెస్టిండీస్‌కు రూ.5.13 కోట్లు,పాకిస్థాన్‌కు రూ.4.10 కోట్లు అందించనున్నారు.

    వివరాలు 

    ఇంగ్లాండ్‌ తో ఐదు టెస్టుల సిరీస్‌

    ఇకపోతే ఐపీఎల్‌ 2025 సీజన్‌ జూన్‌ 3న ముగియనుంది. అనంతరం భారత జట్టు ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లనుంది, అక్కడ ఐదు టెస్టుల సిరీస్‌ను ఆడనుంది.

    ఈ సిరీస్‌తోనే 2025-2027 వరకూ కొనసాగే తదుపరి డబ్ల్యూటీసీ ప్రారంభమవుతుంది. ఈ టెస్టు సిరీస్‌ కోసం భారత జట్టును త్వరలోనే ప్రకటించే అవకాశముందని సమాచారం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐసీసీ
    వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్

    తాజా

    WTC - ICC: టెస్టు క్రికెట్‌ను మరింత ప్రోత్సాహించేందుకు ఐసీసీ కీలక నిర్ణయం.. డబ్ల్యూటీసీ ప్రైజ్‌మనీని భారీగా పెంపు  ఐసీసీ
    Mistakes: మీరు చేస్తున్న ఈ నాలుగు తప్పులే... విజయాన్ని దూరం చేస్తూ, ఓటమిని దగ్గర చేస్తున్నాయ్.. వాటిని ఇవాళే మార్చుకోండి! జీవనశైలి
    Stock Market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. చివరి గంటలో ఊపందుకున్న సూచీలు స్టాక్ మార్కెట్
    Vitamin P: విటమిన్ 'పీ' గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ పోషకపదార్థం సమృద్ధిగా లభించే ఆహారాలివే..! ఆరోగ్యకరమైన ఆహారం

    ఐసీసీ

    ICC Rankings System: క్రికెట్ ప్లేయర్లకు ICC ఇచ్చే ర్యాంకింగ్స్ ను ఎలా లెక్కిస్తుందో తెలుసా?  క్రీడలు
    Siraj Vs Travis Head: ట్రావిస్‌ హెడ్‌, సిరాజ్‌లపై ఐసీసీ సీరియస్ !? మహ్మద్ సిరాజ్
    Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్‌.. భారత్‌ మ్యాచ్‌లు దుబాయ్‌లో..! బీసీసీఐ
    Champions Trophy 2025: ఎట్టకేలకు వీడిన సస్పెన్స్‌.. హైబ్రిడ్ మోడల్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ  క్రీడలు

    వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్

    WTC Final IND VS AUS : ఐసీసీ ఫైనల్స్‌లో ఎవరెన్ని విజయాలు సాధించారంటే!  క్రికెట్
    టెస్టు క్రికెట్‌కు పూర్వ వైభవం వస్తుందని అశిస్తున్నా: స్టీవెన్ స్మిత్ క్రికెట్
    టీమిండియాను చూసి ఆసీస్ వణుకుతోంది: విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ
    WTC FINAL 2023: హేజిల్‌వుడ్ దూరంతో టీమిండియాకు బలం పెరిగిందా..? క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025