
MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి గొప్ప గౌరవం.. ఐసీసీ 'హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి గొప్ప గౌరవం దక్కింది.
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన తాజా 'హాల్ ఆఫ్ ఫేమ్' జాబితాలో ఆయనకు స్థానం లభించింది.
ఈ జాబితాలో మొత్తం ఏడుగురు ప్రముఖులు ఉండగా,ధోనితో పాటు ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్మన్ మాథ్యూ హేడెన్,దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ హషీమ్ ఆమ్లా కూడా ఉన్నారు.
ఈ గౌరవం పొందిన నేపథ్యంలో ధోని స్పందిస్తూ, "ఇది ఒక అద్భుతమైన గౌరవం. ప్రపంచ క్రికెట్కి సేవలందించిన గొప్ప ఆటగాళ్ల సరసన నా పేరు ఉండటం అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప అనుభూతి," అని చెప్పారు.
వివరాలు
ప్రతిష్ఠాత్మక టైటిళ్లు
2020లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోని, తన కెరీర్లో మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 17,266 పరుగులు చేశాడు.
అతని నాయకత్వంలో భారత జట్టు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ప్రతిష్ఠాత్మక టైటిళ్లు గెలుచుకుని దేశానికి గౌరవం తీసుకొచ్చింది.