Loading...
IND Vs SL: తొలి టెస్టులో శ్రీలంక చిత్తు.. టీమిండియా ఘన విజయం
తొలి టెస్టులో శ్రీలంక చిత్తు.. టీమిండియా ఘన విజయం

IND Vs SL: తొలి టెస్టులో శ్రీలంక చిత్తు.. టీమిండియా ఘన విజయం

వ్రాసిన వారు Moogati Shabari
Aug 19, 2026
02:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకతో తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్య ఛేదనలో శ్రీలంక 206 పరుగులకే ఆలౌటైంది. దీంతో 165 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. మానవ్‌ సుతార్ ఫైఫర్‌ (6/55) నమోదు చేశాడు. శ్రీలంక బ్యాటర్లలో సోనాల్ దినుష (84), ధనంజయ డిసిల్వా (59) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్ 6, ప్రసిద్ధ్‌ కృష్ణ 2.. సిరాజ్, జడేజా చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 462 పరుగులు చేయగా.. శ్రీలంక 284 పరుగులకే పరిమితమైంది. రెండోఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 193 పరుగులు చేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మానవ్ సుతార్ 10 వికెట్లు పడగొట్టాడు.

వివరాలు

యువ స్పిన్నర్ మానవ్ సుతార్ మరోసారి అద్భుతం..

యువ స్పిన్నర్ మానవ్ సుతార్ మరోసారి అద్భుతం చేశాడు. ఒకే ఓవర్‌లో (76వ) మూడు వికెట్లు తీశాడు.

సోనాల్ దినుష (84), ప్రభాత్ జయసూర్య (0)ను వరుస బంతుల్లో ఔట్ చేసిన అతడు.. ఓవర్ చివరి బంతికి లాహిరు కుమార (0)ను పెవిలియన్‌కు చేర్చాడు.

సోనాల్‌ క్యాచ్‌ను స్లిప్‌లో ధ్రువ్‌ జురెల్ అందుకొన్నాడు. ప్రభాత్‌ జయసూర్య బౌల్డ్ అయ్యాడు.

ఇక లాహిరు ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ పంత్ అందుకొన్నాడు.

ప్రస్తుతం శ్రీలంక స్కోరు 199/9. శ్రీలంక బ్యాటర్లు వికెట్ ఇవ్వకుండా పట్టుదల ప్రదర్శించారు.

భారత బౌలర్లు మాత్రం శతవిధాలా ఏడో వికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. లంచ్‌ బ్రేక్‌ తర్వాత ఆరు ఓవర్లపాటు ఆట జరిగింది.

వివరాలు

మరోసారి తన సత్తా చాటిన మానవ్ సుతార్..

మ్యాచ్‌ చివరి దశలో మానవ్ సుతార్ మరోసారి తన సత్తా చాటాడు. ఒకే ఓవర్‌లో ఏకంగా మూడు వికెట్లు తీశాడు.

76వ ఓవర్‌లో తొలుత సోనాల్ దినుష (84)ను ఔట్ చేసిన సుతార్.. ఆ తర్వాతి బంతికే ప్రభాత్ జయసూర్య (0)ను పెవిలియన్‌కు పంపాడు.

ఓవర్ చివరి బంతికి లాహిరు కుమార (0)ను కూడా ఔట్ చేశాడు. సోనాల్ దినుష ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో ధ్రువ్ జురెల్ అందుకోగా.. ప్రభాత్ జయసూర్య బౌల్డ్ అయ్యాడు.

లాహిరు కుమార క్యాచ్‌ను వికెట్ కీపర్ రిషభ్ పంత్ అందుకున్నాడు.

ADVERTISEMENT

వివరాలు

1-0 ఆధిక్యంలో టీమిండియా..

ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 60వ ఓవర్‌లో నిరోషన్ డిక్వెల్లా భారీ షాట్‌కు ప్రయత్నించి రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు.

దీంతో శ్రీలంక 156 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత సోనాల్ దినుష, కేశర నువాంత కొంతసేపు వికెట్ కాపాడుకునే ప్రయత్నం చేశారు.

అయితే చివరికి మానవ్ సుతార్ వరుస వికెట్లతో శ్రీలంక పోరాటానికి తెరదించాడు.

చివరకు శ్రీలంక 206 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ 165 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.

దీంతో రెండు టెస్టుల సిరీస్‌లో టీమ్‌ఇండియా 1-0 ఆధిక్యం సాధించింది.

ADVERTISEMENT